/rtv/media/media_files/2025/06/08/hK0ojCkPAVA42ImMDZoC.jpg)
Jubilee Hills MLA Maganti Gopinath
Maganti Gopinath: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మూడు సార్లు పనిచేసిన మాగంటి గోపీనాథ్ రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టిన తీరు ఆసక్తికరం. 1983లో తొలిసారి నందమూరి తారకరామరావు (ఎన్టీఆర్) ముఖ్యమంత్రి అయ్యాక గోపీనాథ్ తెలుగుదేశం పార్టీపై అభిమానం పెంచుకున్నారు. అలా టీడీపీ కార్యకర్తగా మారారు. అయితే 1984లో ఎన్టీఆర్ను బర్తరఫ్ చేసిన సమయంలో గోపీనాథ్ నిరసన తెలుపుతూ తన బుల్లెట్ గ్యాంగ్తో ర్యాలీ తీశారు. అది సంచలనంగా మారింది. ఆ ర్యాలీ గురించి తెలిసి యన్టీఆర్ అభిమానసంఘం నాయకుడు శ్రీపతి రాజేశ్వర్ గోపీనాథ్ను పిలిపించుకుని అభినందించారు. అలా ఆయనతో అభిమానం ఏర్పడింది. 1985లో ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కాగానే మరోసారి గోపీనాథ్ తన గ్యాంగ్తో బుల్లె్ట్ ర్యాలీ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన బుల్లెట్ గ్యాంగ్ ఎంత పాపులర్ అంటే ఈ విషయం తెలిసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జీ రామచంద్రన్ గోపీనాథ్ గ్యాంగ్ను నాటి మద్రాస్కు పిలుపించుకున్నారు. అక్కడ కూడా తన ర్యాలీతో ఆకట్టుకోవడంతో ఆయన అభినందించారు.
Also Read: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు
గోపీనాథ్ను గుర్తించిన ఎన్టీఆర్ ఆయనను తొలిసారి తెలుగుయువత అధ్యక్షుడిగా నియమించారు. అలా రాజకీయాల్లోకి ఎంటరైనా గోపీనాథ్ 1985 నుండి 1992 వరకు గోపీనాథ్ తెలుగుయువత అధ్యక్షునిగా ఉన్నారు. ఆ తర్వాత 1987 నుండి 1989 వరకు 'హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ' (హుడా) (HUDA) డైరెక్టర్ గా పనిచేశారు.
Also Read: పర్సు కొట్టేసిన కోతి...పర్సులో రూ.20 లక్షల విలువైన నగలు..తర్వాత ఏం జరిగిందంటే..
తెలుగుదేశం పార్టీలోనే కేసీఆర్తో పరిచయం ఏర్పడింది. 1990లో ఎన్టీఆర్ నటించిన 'శ్రీక్రిష్ణపాండవీయం'చిత్రంలోని దుర్యోధనుని గెటప్ తో కూడిన భారీ కటౌట్స్ను ఖైరతాబాద్, సెక్రటేరియట్ సమీపంలో గోపీనాథ్ ఏర్పాటు చేశారు. అది గోపీనాథ్ పేరు తెలుగుదేశం పార్టీలో మారుమోగిపోయింది. అదే ఆయనకు యన్టీఆర్ కుటుంబసభ్యులతో పరిచయం ఏర్పడడానికి కారణమైంది. ఇక గోపీనాథ్ 1995లో 'పాతబస్తీ'అనే సినిమాతో సినిమా నిర్మాతగా కూడా మారారు. ఆయన నిర్మాతగా నాలుగు చిత్రాలు నిర్మించారు. తారకరత్న హీరోగా 'భద్రాద్రిరాముడు', రాజశేకర్ హీరోగా 'నా స్టైలే వేరు', రవన్న తీశారు. కానీ ఆ చిత్రాలేవి అంతగా ఆడలేదు.
Also Read: గృహ హింస బాధితురాలికి రూ.కోటి పరిహారం ఇవ్వాలన్న కోర్టు
తెలంగాణ ఉద్యమం అనంతరం రాష్ర్ట విభజన జరగగా 2014లో జూబ్లీ హిల్స్ తెలుగుదేశం (TDP) అభ్యర్థిగా గోపీనాథ్కు సీటును ఇచ్చారు. తొమ్మిది వేలకు పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు గోపీనాథ్. ఆ తర్వాత రాష్ర్టంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ (TRS) అభ్యర్థిగా పోటీచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అలా జూబ్లీ హిల్స్ నియోజక వర్గంలో 'హ్యాట్రిక్' సాధించిన తొలి నాయకునిగా గోపీనాథ్ చరిత్రలో నిలిచారు.గోపీనాథ్ కు భార్య సునీత, కొడుకు వాత్సల్యనాథ్, కూతుళ్ళు దివ్య అక్షరనాగ్, దిశిర ఉన్నారు.
Also Read: అఖిల్ సంగీత్ లో నాగచైతన్య, నాగార్జున రచ్చ రచ్చ! వీడియో వైరల్