/rtv/media/media_files/2025/02/20/VjgPhTTjq7gFKRigmOSo.jpg)
Maganti Gopinath
KTR - Maganti Gopinath:
గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(mla maganti gopinath) ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పరామర్శించారు. విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ గోపీనాథ్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిన వెంటనే ఆయన తన పర్యటనను కుదించుకుని ఇండియా వచ్చారు. ఆయన వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్లారు.
Also Read: ఆపరేషన్ సిందూర్ పేరు వింటే పాకిస్తాన్కు అదే గుర్తువస్తుంది: PM మోదీ
నివారం ఉదయం అమెరికా పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్.. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ నాయకులతో కలిసి గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. త్వరలోనే మాగంటి గోపీనాథ్ కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. తిరిగి ఆయన ప్రజాజీవితంలోకి అడుగు పెడుతారని ఆకాంక్షించారు.
Alsoo Read : ఏపీలో మత్తు ఇంజెక్షన్ల కలకలం
కాగా, గత గురువారం మాగంటి గోపీనాథ్ గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి హాస్పిటల్లోనే చికిత్స అందిస్తున్నారు. కార్డియాక్ అరెస్టు కావడం.. సీపీఆర్తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. ఇంకా అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. కొంత సమయం గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. ఆయన భార్య వెంట కేటీఆర్ భార్య శైలీమ ఉండి వారి కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హరీశ్రావుతో పాటు ఇతర నేతలు కూడా ఆయనను పరామర్శించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, రవీందర్ రావు, నాయకులు మాలోతు కవిత, రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.
Also Read: ఛత్తీస్గఢ్లో ఎన్ కౌంటర్, మరో ఇద్దరు మావోయిస్టులు మృతి