Pawan Kalyan: పవన్ పర్యటనలో తొక్కిసలాట.. బాలికకు సీరియస్!
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ బాలిక స్పృహ తప్పింది. దీంతో హుటాహుటిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. నేడు కృష్ణ జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ బాలిక స్పృహ తప్పింది. దీంతో హుటాహుటిన ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. నేడు కృష్ణ జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో గ్రామానికి చెందిన రైతు తన పంట పొలాన్ని అడవి పందుల నుంచి రక్షించుకునేందుకు ఉచ్చును ఏర్పాటు చేశాడు. ప్రమాదవశాత్తు ఉచ్చులో చిక్కుకుని చిరుత పులి మరణించింది.
కృష్ణాజిల్లాలో ఓ కీచక టీచర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. నరసింహపురం ఎంపీపీ స్కూల్లో మూడవ తరగతి చదువుతున్న బాలిక తొడపై కొరికి అసభ్యకరంగా ప్రవర్తించాడు. టీచర్ ప్రవర్తన గురించి చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భారీ వర్షాలతో కృష్ణాజిల్లా గన్నవరం నిడమానూరు వద్ద రైలు పట్టాల పైకి వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందుగానే ఆ దారిలోని రైళ్లను రద్దు చేశారు. బుడమేరు వరద ఉధృతి పెరగడంతో నీడమానూరు జాతీయ రహదార్లు, రైలు పట్టాల పైకి వరద నీళ్లు పోటెత్తాయి.
కృష్ణా జిల్లా కృతివెన్ను మండలం శీతనపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. శీతన పల్లి వద్ద హైవే పై రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరు లారీల డ్రైవర్లతో పాటు నలుగురు అందులో ప్రయాణిస్తున్న వారు మరణించారు.
ఆస్ట్రేలియాలో స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేందుకు ట్రెక్కింగ్ కు వెళ్లిన కృష్ణాజిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(23) అనే యువతి ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి అక్కడికక్కడే మృతి చెందింది.
పెనమలూరు వైసీపీ టెకెట్ ను మంత్రి జోగిరమేష్ కు కేటాయించడాన్ని నిరసిస్తూ స్థానిక నాయకులు ఫ్లెక్సీలు కట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జోగి రమేష్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త నియోజక వర్గం పెనమలూరులో పర్యటించేందుకు సిద్ధం అయ్యారు..
ఆంధ్రపద్రేశ్లో నిషేధిత నత్తల పెంపకంపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నిషేధిత థాయిలాండ్ నత్తల పెంపకానికి సంబంధించి కేంద్ర అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో కలకలం రేపింది. నిషేధిత థాయ్లాండ్ నత్తల శ్రీవిశ్వశాంతి విద్యాసంస్థ ప్రాంగణంలో కనిపించాయి.
నీళ్లు రాక బీడు భూములుగా మారిన తమ పంటపొలాల్లో బైక్ నడిపి నిరసన తెలిపారు రైతులు. ఈ ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండల పరిధిలోని మందపాకల గ్రామంలో చోటు చేసుకుంది. అధికారులు స్పందించి నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.