ఏపీలో విషాదం.. చెరువులో ఏడుగురు విద్యార్థులు గల్లంతు..
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. అందులో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.