BIG BREAKING : దర్శకుడు విక్రమ్ సుకుమారన్ కన్నుమూత
తమిళ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఓ నిర్మాతకు తన తదుపరి చిత్రం కథ చెప్పడానికి మధురై వెళ్లి తిరిగి బస్సులో ఇంటికి వస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు.
తమిళ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఓ నిర్మాతకు తన తదుపరి చిత్రం కథ చెప్పడానికి మధురై వెళ్లి తిరిగి బస్సులో ఇంటికి వస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించాడు.
కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు కన్నడలో తీవ్ర దుమారం రేపాయి. దీని కారణంగా ‘థగ్ లైఫ్’ మూవీకి బిగ్ షాక్ తగలబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టిలోగా అతడు కమల్ క్షమాపణలు చెప్పకపోతే కర్ణాటకలో ఈ చిత్రాన్ని అడ్డుకుంటామని KFCC తెలిపింది.
స్లీవ్లెస్ దుస్తులపై ఓ రిపోర్టర్ ప్రశ్నించడంతో ఐశ్వర్య ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ సినిమా కార్యక్రమంలో తన దుస్తులపై చర్చ ఎందుకంటూ ప్రశ్నించింది. ప్రస్తుతానికి ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
జయం రవి చేసిన ఆరోపణలను ఖండిస్తూ అతని భార్య ఆర్తి రవి మంగళవారం ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఆమె తాము విడిపోవడానికి మనీ, పవర్ కారణం కాదంది. తమ బంధంలోకి మూడోవ వ్యక్తి రావడమే తాము విడిపోవడానికి కారణమంటూ ఆర్తి సంచలన ప్రకటన చేసింది.
హీరోయిన్ సాయి ధన్సికతో విశాల్ త్వరలో ఏడడుగులు వేయనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని టాక్ నడుస్తోంది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలిపారని దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లితో ఒకటి కాబోతున్నట్లు సమాచారం.
జయం రవి ఆరోపణలపై తాజాగా ఆర్తి తల్లి, నిర్మాత సుజాత విజయ్కుమార్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. జయం రవిని అల్లుడిలా కాకుండా కొడుకులా చూసుకున్నానని వెల్లడించారు. రూ.100 కోట్లు అప్పులు చేసి మరీ అతనితో సినిమాలు నిర్మించానన్నారు సుజాత.
తమిళనాడులోని విల్లుపురంలో జరిగిన ఓ ఈవెంట్ లో హీరో విశాల్ సృహ తప్పి పడిపోవడంపై ఆయన మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వలనే ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించినట్లు చెప్పారు.
హీరో ధనుష్ మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కున్న ఈమూవీని D56 టైటిల్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ పంచుకున్నారు. పుర్రెను ఖడ్గంతో గుచ్చిన పోస్టర్ ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తోంది.
ప్రముఖ కోలీవుడ్ నటుడు, పవన్ కల్యాణ్ గురువు 'షిహాన్ హుస్సేనీ' (60) కన్నుమూశారు. కొద్దిరోజులుగా లుకేమియాతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పవన్కు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ హుస్సేనీ నేర్పించారు.