High Tension At Border | బోర్డర్లో టెన్షన్..ఊళ్లన్నీ ఖాళీ| India Pakistan War | Pahalgam Attack |RTV
కశ్మీర్ ఇండియాదే.. కశ్మీరీలు మనవాళ్లే అని విజయ్ అన్నారు. కశ్మీర్లో జరుగుతున్న దారుణాలకు సరైన చదువు లేకపోవడమే. కారణమని విజయ్ అభిప్రాయపడ్డారు. వాళ్లందరికీ చదువు చెప్పించి, బ్రెయిన్వాష్ కాకుండా ఉండేలా శిక్షణ ఇవ్వాలన్నారు.
జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని గుర్రే గ్రామానికి చెందిన ఆదిల్ అహ్మద్ థోకర్ 2018లో విద్యార్థి వీసాతో పాకిస్తాన్కు వెళ్లాడు. అక్కడ ఆరు సంవత్సరాల పాటు టెర్రరిస్ట్ కార్యకలాపాల్లో శిక్షణ తీసుకుని తిరిగి నలుగురు ఉగ్రవాదులతో ఇండియాకు వచ్చాడు.
ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు కోల్పోయాడు. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్ భూషణ్ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది.
టెర్రరిస్టుల దాడికి వ్యతిరేకంగా కశ్మీర్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మృతులు, బాధితుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ అక్కడి ప్రజలు, వ్యాపారులు, హోటల్స్ యజమానులు రోడ్లమీదికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఆర్మీకి అండగా ఉంటాం అంటూ నినాదాలు చేశారు.
జమ్మూకశ్మీర్ లో పర్యటకులపై ఉగ్రవాదుల కాల్పులు కలకలం రేపాయి. అయితే ఈ కాల్పుల వెనుక పహల్గాం ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా టాప్ కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉండొచ్చంటూ నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇస్లాంలో కల్మా అనేది అల్లాహ్ యొక్క ఏకత్వం. విశ్వాసాన్ని ధృవీకరించే విశ్వాస ప్రకటన. ముస్లింలు కల్మాను క్రమం తప్పకుండా పఠించడం అనేది అల్లాను మాత్రమే ఆరాధించడం. ప్రవక్త ముహమ్మద్ బోధనలను అనుసరించడం పట్ల తమకున్న నిబద్ధతను గుర్తుచేసుకోవడానికి ఒక మార్గం.