బీజేపీ నేత న్యూడ్ వీడియో కాల్ | Guntur District BJP Leader Video Call Leak | RTV
గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వనమా నరేంద్ర రాసలీలల బాగోతం బయటపడింది. జనసేన నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన మహిళతో మాట్లాడిన వాట్సప్ వీడియో కాల్ వైరల్ అవుతోంది. 'రేపు కలుద్దాం. పోయినసారిలాగే చేద్దాం. మందు తాగుదాం' అనే సంభాషణ ఇందులో చూడొచ్చు.
గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. పాముకాటుతో మయన్మార్కు చెందిన విద్యార్థి మృతి చెందాడు. బుద్ధిజంలో M.A చేస్తున్న కొండన్న యూనివర్సిటీలో పుట్టగొడుగులు సేకరిస్తుండగా రక్తపింజర పాము కాటేసింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు.
గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఓ మహిళ అనుమానాస్పద మృతి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు మహిళలు అప్పు తీసుకొని.. మళ్లీ అడిగితే కూల్డ్రింక్లో సైనైడ్ కలిపి చంపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. 4 హత్యలు, 3 హత్యాయత్నాలు చేసిన లేడీ కిల్లర్స్ ను అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమను అంగీకరించలేదని యువతిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు జిల్లా కిడ్నీ రాకెట్ కేసులో ఇద్దరు నిందితులును నగరంపాలెం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు భాషా, సుబ్రమణ్యంను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు. ఇద్దరి విచారణ పూర్తయిందని.. న్యాయస్థానం ముందు హాజరు పరుస్తామని వెల్లడించారు.
ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ అమ్ముకోవాలనుకున్నానన్నారు బాధితుడు మధుబాబు. బాషా అనే వ్యక్తి కిడ్నీ ఇస్తే రూ. 30 లక్షలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేశాడని వాపోయాడు. విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో తన కిడ్నీ తీసుకుని డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నాడు.
గుంటూరు జిల్లా రాయపూడి హోసన్నా ప్రార్థనా మందిరం వివాదంపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సమావేశం నిర్వహించారు. తుళ్ళూరు MPDO కార్యాలయంలో రాయపూడి గ్రామస్తులతో సమావేశం అయ్యారు. అక్కడికి చేరుకున్న శివ స్వామిని అధికారులు లోపలికి అనుమతించలేదు.
పల్నాడు జిల్లా చిన తురకపాలెంలో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తోన్నాయి. గ్రామంలో ఇంటి తలుపులు, గోడలకు, చెట్లకు మేకులు కొట్టి ఎర్రగుడ్డలో మంత్రించిన నిమ్మకాయలను దుండగులు ఇంటి ముందు పడేస్తున్నారు. భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు క్షుద్రపూజల భయంతో రాత్రంతా జాగారం చేస్తున్నారు.