సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు NOC జారీ.. ఆమోదించిన ఛత్తీస్గఢ్ సీఎం
గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ ప్రాజెక్టుకు NOC జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు.
గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఈ ప్రాజెక్టుకు NOC జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, వాటాలు, అనుమతులు, కొత్త ప్రాజెక్టుల అంశంపై కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో బుధవారం కీలక సమావేశం జరిగింది. హైదరాబాద్లో జీఆర్ఎంబీ, అమరావతిలో కేఆర్ఎంబీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే..గోదావరి బనకచర్లపై శాసనసభలో చర్చ పెడదాం..స్పీకర్ కు లేఖ రాయమని సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందెవరో నువ్వు నేను చర్చిద్దాం రమ్మని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.
మూడు నదులను అనుసంధానం చేసి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించాలనుకుంటున్న ప్రతిపాదన 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. గోదావరి వరద జలాలను పెన్నా బెసిన్కు తరలించాలని ఏపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ను డిజైన్ చేసింది. దీనికి తెలంగాణ ఒప్పుకోవడం లేదు.
బాసర దర్శనానికి వెళ్లిన ఐదుగురు యువకులు గోదావరిలో గల్లంతు అయ్యారు. నదిలో స్నానానికి వెళ్లగా కొట్టుకుపోయారు. వారంతా హైదరాబాద్ దిల్సుఖ్నగర్ చెందినవారు. గజఈగాళ్ల సాయంతో నలుగురి మృతదేహాలు బయటకు తీశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో గల మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతు అయ్యారు. పది మంది శుక్రవారం సాయంత్రం నదిలో స్నానానికి వెళ్తే అందులో ఆరుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసేత్రివేణి సంగమంలో నేటి నుంచి 26 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి.
తెలంగాణలో త్వరలోనే పుష్కరాల ఘట్టం ప్రారంభమవ్వనుంది. వరుసగా గోదావరి, కృష్ణా, సరస్వతి నదులకు పుష్కరాలు రానున్నాయి. దీంతో ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో 170 స్నానఘాట్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.