కుంభమేళాలో డేంజర్ బ్యాక్టీరియా.. | Shocking Facts About Maha Kumbh Mela 2025 | Prayag Raj | RTV
కుంభమేళాకు బీహార్ నుంచి ఏడుగురు యువకులు బోట్లో ప్రయాణించారు. గంగానదిలో 550 కిలో మీటర్లు 2 రోజుల్లో చేరుకున్నారు. రోడ్డు, రైలు మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉందని వీరు ఈ మార్గంలో వెళ్లారు. ఫిబ్రవరి 13న ప్రయాగ్రాజ్ సంగంలో పవిత్ర స్నానం ఆచరించి తిరిగొచ్చారు.
ఉత్తరప్రదేశ్లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు గంగా నదిలో రెండు రోజుల పాటు వేలాడదీశారు. గంగానదిలో ఉంచితే విషం పోతుందని కొందరు చెప్పడంతో వారు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
యూపీలోని కాన్పూర్లో గంగా ఘాట్లో ఓ ముసలి బయటపడింది. మత్స్యకారులు ఆ మొసలిని పట్టుకొని అక్కడ ఉండే ఆలయం వద్దకు తీసుకొచ్చారు. దీంతో కొందరు భక్తులు ఆ మొసలికి బొట్టు పెట్టి పూజలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరలవుతోంది.
నిన్న హరిద్వార్లో జరిగిన ఓ ఘటన అందరినీ విషాదంలో ముంచెత్తింది. కన్న తల్లిదండ్రులే తమ ఐదేళ్ళ పిల్లాడిని గంగానదిలో ముంచి చంపారు అంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్లో గంగలో మునగక ముందే పిల్లాడు చనిపోయాడని తేలింది.
మూఢనమ్మకం హరిద్వార్లో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొంది. క్యాన్సర్ బారిన పడ్డ పిల్లాడిని రోగాన్ని నయం చేయడం కోసమంటూ గంగనదిలో పదేపదే ముంచారు తల్లిదండ్రులు. దీంతో పిల్లాడు చనిపోయాడు. అయితే చిన్నారిని కుటుంబీకులే కావాలనే నీట ముంచారని స్థానికులు ఆరోపిస్తున్నారు.