Kodangal: కేటీఆర్ వద్దకు కొడంగల్ భూముల పంచాయితీ.. బలవంతంగా గుంజుకుంటున్నారని రైతులు ఆవేదన!
కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడంటూ పలువురు రైతులు కేటీఆర్ తో ఆవేదన వ్యక్తం చేశారు. 3 వేల ఎకరాల భూమిని బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, తమకు అండగా నిలవాలంటూ వినతిపత్రం అందించారు.