సంగారెడ్డిలో రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
సంగారెడ్డి జిల్లాలో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద తనిఖీల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.100 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. డ్రగ్స్ పట్టుబడ్డాక డ్రైవర్, క్లీనర్ పరారయ్యారు.