భారత రక్షణ రంగంలో కీలక నిర్ణయం
రక్షణ రంగంలో 10 ప్రతిపాదలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1.05 లక్షల కోట్లతో డిఫెన్స్ రంగాన్ని పటిష్టం చేసేలా ప్రణాళికలు రూపొందించింది.
రక్షణ రంగంలో 10 ప్రతిపాదలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1.05 లక్షల కోట్లతో డిఫెన్స్ రంగాన్ని పటిష్టం చేసేలా ప్రణాళికలు రూపొందించింది.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్జున్తో భేటీ అయ్యారు. డాంగ్జున్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి, చైనాతో దౌత్య సంబంధాలను మెరుగుపరచడానికి 4 అంశాల ఫార్ములాను ఆయన ప్రతిపాదించారు.
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చైనాలోని కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారతదేశం, పాకిస్తాన్ మధ్య పోలికను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య తల్లిగా గుర్తిస్తే.. పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదానికి తండ్రిగా మారిందని ఆయన అన్నారు.
1947 నుంచి పాక్ ఆడుతున్న గేమ్ ముగిసిందని, ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. యుద్ధనౌక INS విక్రాంత్ ఆయన శుక్రవారం సందర్శించారు. ఉగ్రవాదుల్ని నాశనం చేయడానికి పాక్ను ఎలాగైనా దెబ్బకొడతామన్నారు.
ఆపరేషన్ సిందూర్లో బ్రహ్మోస్ క్షిపణి ఉపయోగించామని యూసీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లక్నోలో నేడు బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వర్చువల్గా దాన్ని ప్రారంభించారు.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాజ్నాథ్ సింగ్. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని అన్నారు. ఓటమి భయంతో కేజ్రీవాల్ సహా ఇండియా కూటమి నేతలు బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.