రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనాకు 4 ప్రతిపాదనలు

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం చైనా రక్షణ మంత్రి అడ్మిరల్‌ డాంగ్‌జున్‌‌తో భేటీ అయ్యారు. డాంగ్‌జున్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి, చైనాతో దౌత్య సంబంధాలను మెరుగుపరచడానికి 4 అంశాల ఫార్ములాను ఆయన ప్రతిపాదించారు.

New Update
Defence minister

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. కింగ్‌డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి హాజరైన రక్షణ మంత్రి.. శుక్రవారం చైనా రక్షణ మంత్రి అడ్మిరల్‌ డాంగ్‌జున్‌‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డాంగ్‌జున్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి, చైనాతో దౌత్య సంబంధాలను మెరుగుపరచడానికి నాలుగు అంశాల ఫార్ములాను రాజ్‌నాథ్‌ ప్రతిపాదించారు. 

1. 2024లో బలగాల ఉపసంహరణ కోసం చేసుకున్న ఒప్పందానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండటం
2. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను పూర్తిగా చల్లార్చేందుకు నిరంతర ప్రయత్నాలు కొనసాగించడం
3. సరిహద్దుల మార్కింగ్, డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేసి వివాదాలకు శాశ్వత ముగింపు పలకడం
4. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకొని సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇప్పటికే ఉన్న ప్రత్యేక ప్రతినిధుల స్థాయి యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కొత్త ప్రక్రియలను రూపొందించడం ఉన్నాయి. 
ఇక ఈ భేటీలో ఉగ్రవాదం, ఆపరేషన్‌ సిందూర్‌ వంటి అంశాలను కూడా చైనా రక్షణ మంత్రి ముందు రాజ్‌నాథ్‌ ప్రస్తావించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు