/rtv/media/media_files/2024/11/02/nfTTiFjxbTUm19bU6aMC.jpg)
రక్షణరంగం బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ రంగంలో 10 ప్రతిపాదలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.1.05 లక్షల కోట్లతో డిఫెన్స్ రంగాన్ని పటిష్టం చేసేలా ప్రణాళికలు రూపొందించింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, మిలిటరీ హార్డ్ వేర్ సహా 10 ప్రతిపాదనలకు సెంట్రల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే ఇండియన్ ఆర్మీలోకి అత్యాధునిక ఆయుధాలు రాబోతున్నాయి.
DAC approves 10 capital acquisition proposals
— All India Radio News (@airnewsalerts) July 3, 2025
Defence Acquisition Council, #DAC, under the chairmanship of Defence Minister @rajnathsingh, has accorded Acceptance of Necessity for ten capital acquisition proposals amounting to over one lakh crore through indigenous sourcing.… pic.twitter.com/yof9JJ6zhq
ఇందులో ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ ఉన్నాయి. స్వదేశీ సోర్సింగ్ ద్వారా సైనిక హార్డ్వేర్ను కొనుగోలు చేయడానికి DAC శుక్రవారం 10 ప్రతిపాదనలను ఆమోదించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ, ఆర్మర్డ్ రికవరీ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్, త్రివిధ దళాల కోసం ఇంటిగ్రేటెడ్ కామన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ మరియు ఉపరితలం నుండి గగనతలానికి క్షిపణుల సేకరణకు ఆవశ్యకత అంగీకారాన్ని ఇచ్చింది.