Union Minister Rajnath Singh: చైనా వేదికగా పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్

సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చైనాలోని కింగ్‌డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరయ్యారు.

New Update
At least 100 terrorists killed in Indian strikes in Pakistan, Says Rajnath Singh

At least 100 terrorists killed in Indian strikes in Pakistan, Says Rajnath Singh

Union Minister Rajnath Singh: సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చైనాలోని కింగ్‌డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరయ్యారు. గల్వాన్‌ లోయ ఘటన తర్వాత ఆయన చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. షాంఘైలో జరిగిన SCO మీటింగ్‌లో పాకిస్తాన్‌పై ఆగ్రహం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో ఇటీవలే పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి రాజ్‌నాథ్‌ మాట్లాడారు. దీనికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ గురించి కూడా వివరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం భారత్ హక్కు అంటూ కుండ బద్దలు కొట్టారు. పాకిస్తాన్ క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. పాక్ తీరును సరిహద్దు దేశాలు ఖండించాలని ఆయన కోరారు. పాకిస్తాన్‌ను చైనా అడ్డుకోవాలంటూ సున్నితంగా హెచ్చరించారు. శాంతి- టెర్రరిజం ఒకే చోట ఉండవని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు