TG Crime: పెళ్లి కొడుకును కాటేసిన కరెంట్.. మహబూబాబాద్ జిల్లాలో పెను విషాదం!
పెళ్లి అయిన మూడు రోజులకే వరుడు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్లో జరిగింది. బయ్యారం మండలానికి చెందిన నరేశ్కు, విజయవాడకు చెందిన జాహ్నవితో ఈ నెల 18న వివాహం జరిగింది. ఇంట్లో బోరు మోటారు కోసం విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా నరేశ్కు షాక్ తగిలి మృతి చెందాడు.