India vs Pakistan: కోహ్లికి హగ్ ఇవ్వొద్దు.. వారితో చనువుగా ఉండొద్దు: టీమిండియాపై పాకిస్థాన్ గరంగరం!
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్-పాక్ మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో పాక్ ఫ్యాన్స్ తమ క్రికెటర్లకు హెచ్చరికలు చేస్తున్నారు. తమ దేశానికి రాని భారత క్రికెటర్లతో చనువుగా ఉండొద్దని అంటున్నారు. విరాట్ కోహ్లికి హగ్లు ఇవ్వొద్దని చెబుతున్నారు.