Champions Trophy 2025: ఆ ఛాంపియన్స్ ట్రోఫీకి, ఇప్పటికీ తేడా ఏంటంటే?

వచ్చే నెల నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అయితే గత ఛాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఈసారి జట్లు విషయంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 2017లో జరిగిన ట్రోఫీలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించగా.. ప్రస్తుతం రోహిత్ శర్మ సారధిగా ఉన్నాడు.

New Update
Champions Trophy

Champions Trophy 2025

ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత్ జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గిల్, జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్షదీప్ సింగ్ జట్టులో చోటు సంపాదించుకున్నారు. అయితే 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరూ జట్టుకి సారధ్యం వహించారు? ఎలాంటి ఆట తీరును కనబరిచారో? పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి: Breaking News: ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి

ఆ ఛాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్‌గా..

2017 ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025) లో విరాట్ కోహ్లి (Virat Kohli) కెప్టెన్‌గా ఉన్నాడు. ధోని వారసత్వం కనిపించే దిశగా వ్యవహరించాడు. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీకి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. 

2017 ఛాంపియన్స్ ట్రోఫీలో శిఖర్ ధావన్ వైస్ కెప్టె్న్‌గా ఉండగా.. ఇప్పుడు శుభ్‌మాన్ గిల్‌ ఉన్నాడు. 

2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఎమ్ ఎస్ ధోని, యువరాజ్ సింగ్ కష్టమైన క్షణాలలో కూడా జట్టును ముందుకు నడిపించారు. ఇప్పుడు ఆ బాధ్యతలను విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి: RBI: బ్యాంకు అకౌంట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన..ఆ పని చేయలేదో నష్టం మీకే!

2017 ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా, భువనేశ్వర్ కుమార్ స్వింగ్ కీలకంగా ఉన్నారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ షమీ కూడా నాయకత్వం వహించనున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ కూడా తన నైపుణ్యాన్ని ప్రదర్శించనున్నాడు. 

2017 ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో హార్దిక్‌తో కలిసి అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కనబరచనున్నారు.

ఇది కూడా చూడండి: Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!

2017 ఛాంపియన్స్ ట్రోఫీలో అశ్విన్ ఆఫ్ స్పిన్, జడేజా ఉండగా.. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ మణికట్టు స్పిన్, ఆల్ రౌండ్ స్పిన్‌గా ఎంపిక చేశారు.

2017 ఛాంపియన్స్ ట్రోఫీలో మనీష్ పాండే, కేదార్ జాదవ్ వంటి ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఇప్పుడు యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్ సింగ్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎంట్రీ ఇచ్చారు.

2017 ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా విజయానికి పునాది వేశారు. మరి ఈసారి ఈ క్రికెట్ దిగ్గజాలు ఏం చేస్తారో చూడాలి.

ఇది కూడా చూడండి: Horoscope: నేడు ఈ రాశి వారు వారికి చాలా దూరంగా ఉండాలి..లేకపోతే ఇక అంతే సంగతులు

Advertisment
Advertisment
తాజా కథనాలు