🔴Live Breakings: జగన్కు థాంక్స్ చెప్పిన పవన్..
నాగార్జున స్థానంలో బాలయ్య బిగ్ బాస్ 9 హోస్టుగా వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాగ్ వరుస ప్రాజెక్టులతో బిజీ కారణంగా షో నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఫ్యాన్స్ బాలయ్యను బిగ్ బాస్ వేదికపై చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అఘోరీపై వర్షిణీ పేరెంట్స్ షాకింగ్ ఆరోపణలు చేశారు. వర్షిణీని తనతో పంపించాలని.. దానికి బదులుగా రూ.3 కోట్లు ఇస్తానని అఘోరీ తమను కోరిందని అన్నారు. బాండ్ పేపర్ మీద సంతకాలు చేయ్యమని కోరగా.. తాము ఒప్పుకోలేదని వర్షిణీ పేరెంట్స్ తెలిపారు.
ఎండల్లో తిరిగితే వడదెబ్బ బారిన పడకుండా నిమ్మకాయలు ఎక్కువగా వాడతారు. ఈ ప్రభావంతో నిమ్మకాయల ధర పెరుగుతోంది. ఏపీ రాష్ట్రంలో ఏలూరు, రాపూరు, దెందులూరు, తెనాలి, హోల్సేల్ మార్కెట్లకు రోజూ 2 వేల క్వింటాళ్ల దాకా నిమ్మకాయలు వస్తున్నాయి.
వకీల్సాబ్తో ఫేమ్ సంపాదించుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాతోనే ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ చిత్రానికి రాకేష్ జగ్గి దర్శకత్వం వహిస్తుండగా, ఇమ్మత్ లడుమోర్ నిర్మిస్తున్నారు.
కండక్టర్ అహ్మద్ అన్సారీ సమస్యపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందని.. అతడికి ఆర్టీసీలోనే మరేదైనా ఉద్యోగం ఇచ్చేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు సూచించామని తెలిపారు.
ఎన్టీఆర్, సుకుమార్ కలిసి ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. సుకుమార్ భార్య తబిత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తారక్ కి ప్రేమతో అని ఆమె క్యాప్షన్ ఇవ్వగా.. నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్" అనే ఎన్టీఆర్ రిపోస్ట్ చేశారు.
తనకు మళ్లీ అవకాశం వస్తే గతంలో టీమిండియాలో అదరగొట్టిన సెహ్వాగ్, సచిన్, గంగూలీ, యువరాజ్లతో కలిసి ఆడాలని కోరుకుంటున్నాని ఓ పాడ్కాస్ట్లో ధోని అన్నాడు. కష్ట సమయాల్లో వీరి ప్రదర్శన మనమంతా చూశాం. అప్పుడు వీరు ఆడుతుంటే అందంగా అనిపిస్తుండేదని చెప్పుకొచ్చాడు.