Delhi Ordinance Bill : ఆందోళనల నడుమే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు లోకసభ ఆమోదం...!!
విపక్షాల ఆందోళనల మధ్యే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు (Delhi Ordinance Bill) 2023కి లోకసభ ఆమోదం తెలిపింది. గురువారం సాయంత్రం మూజువాణి ఓటుతో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో విపక్షాలు లోకసభ నుంచి వాకౌట్ చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ సెషన్ మొత్తానికి సస్పెండ్ అయ్యారు.