భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేశాయి. వరంగల్ భద్రకాళి చెరువుకు వరద పోటెత్తింది. వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం మాత్రం తగ్గడం లేదు. భారీవరద కారణంగా భద్రకాళి చెరువుకు గండి పడింది. భద్రకాళి చెరువుకు ఒక్కసారిగా గండిపడడంతో పోతన నగర్, సరస్వతి నగర్కు ప్రమాదం పొంచి ఉంది. ఆయా కాలనీలో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. వరద ఫ్లో ఎక్కువైతే ఆయా కాలనీలు నీటిలో పూర్తిగా మునిగిపోతాయని స్థానికులు వాపోతున్నారు. కాలనీవాసులను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి అనుచరులు అయినటువంటి పురుషోత్తం,అనిల్ను పోలీసులు చితకబాదారు. బాధిత ప్రజలను కలుసుకోవడం వారికి సహయం చేయడంలో ఉన్న తప్పేంటి? అంటూ పోలీసులతో రాకేష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడం కూడా నేరమా? అంటూ పోలీసులను ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..భద్రకాళీ చెరువుకు గండి, భయపడుతున్న కాలనీవాసులు
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో వరంగల్ జిల్లాలోని ప్రముఖ దేవాలయం అయినటువంటి భద్రకాళీ దేవాలయానికి ఆనుకొని ఉన్న భద్రకాళీ చెరువుకు గండిపడింది. దీని కారణంగా భద్రకాళీ దేవాలయానికి సమీపంలో ఉన్నటువంటి పోతన్ నగర్, సరస్వతి నగర్ వాసులకు ప్రమాదం పొంచి ఉంది. దీనికారణంగా పోతన్ నగర్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
Translate this News: