దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూమిని ప్రభుత్వం కబ్జా చేయాలని చూస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేటలో ఈటల రాజేందర్ పర్యటించారు. పోలీసులు అరెస్ట్ చేసిన దళితులను పరామర్శించారు. కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల.. సీఎం అసైన్డ్ భూములను ఆక్రమించుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.బడంగ్పేటలో గత ప్రభుత్వం దళితులకు 42 ఎకరాల అసైన్డ్ భూమిని ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ భూమిలో 24 ఎకరాలు ప్రభుత్వ ఆఫీస్లకు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన 16 ఎకరాలల్లో దళితులు వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. ఎప్పటిలాగే దళితులు పొలం దున్నుకోవడానికి తమకు కేటాయించిన అసైన్డ్ భూమి వద్దకు వెళ్తే పోలీసులు వారిని అడ్డుకున్నారన్నారు. మా భూమిల్లోకి మేము వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించిన వారిని ఎలా అరెస్ట్ చేస్తారన్నారు
పూర్తిగా చదవండి..కేసీఆర్..! నీ అబ్బ జాగీరు కాదు: ఈటల
సీఎం కేసీఆర్పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాంజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసుకుటున్న దళితులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. గత ప్రభుత్వం బడంగ్పేటలో దళితులకు 42 ఎకరాలు కేటాయిస్తే కేసీఆర్ దానిని దోచుకోవడం ప్రారంభించారని ఆరోపించారు
Translate this News: