Delhi Ordinance Bill : విపక్షాల గందరగోళం మధ్యే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు (Delhi Ordinance Bill)కు ఆమోదం తెలిపింది లోకసభ. గురువారం సాయంత్రం మూజువాణి ఓటు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందింది. విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేయడంతో పార్లమెంట్ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు విపక్షాలు కూడా బిల్లుపై చర్చల్లో పాల్గొని.. అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అనంతరం కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై చర్చలో పాల్గొన్నారు. విపక్షాల అభ్యంతరాలకు అమిత్ షా సమాధానం ఇచ్చారు. మూజువాణి ఓటు జరిగింది. విపక్షాల ఆందోళన నడుమే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లకు ఆమోదం లభించింది. ఆప్ ఎంపీ రింకూ సింగ్ పేపర్ను చించి స్పీకర్ కుర్చీ వైపు విసిరారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సుశీల్ కుమార్ రింకూ చైర్ను అవమానించినందున సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎంపీ సుశీల్ కుమార్ రింకూ సెషన్ మొత్తానికి సస్పెండ్ అయ్యారు. శుక్రవారం రాజ్యసభ ముందుకు బిల్లు చర్చకు రానుంది.
పూర్తిగా చదవండి..Delhi Ordinance Bill : ఆందోళనల నడుమే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు లోకసభ ఆమోదం…!!
విపక్షాల ఆందోళనల మధ్యే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు (Delhi Ordinance Bill) 2023కి లోకసభ ఆమోదం తెలిపింది. గురువారం సాయంత్రం మూజువాణి ఓటుతో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో విపక్షాలు లోకసభ నుంచి వాకౌట్ చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ సెషన్ మొత్తానికి సస్పెండ్ అయ్యారు.
Translate this News: