మణిపూర్లో (Manipur) మహిళలను నగ్నంగా ఊరేగించిన అంశంపై తాను అధినాయకత్వానికి కట్టుబడి ఉంటానని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ (Bharti Praveen) అన్నారు. ఆదివారం శ్రీవారి దర్శనం కోసం తిరుపతి (Tirupati) వచ్చిన ఆమె.. ముందుగా తిరుపతిలోని గ్రామ దేవత గంగమ్మ(Gangamma)కు సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాల వల్ల ప్రజలకు అంటువ్యాధులు, విష జ్వరాలు సోకకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రాల్లో గ్రామ స్థాయి నుంచి నగరపాలక సంస్థ వరకు పారిశుద్ధ్యంపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
పూర్తిగా చదవండి..మణిపూర్ అంశంపై అధినాయకత్వానికి కట్టుబడి ఉంటా
కేంద్ర కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ తిరుపతిలో పర్యటించారు. తిరుపతిలో గ్రామ దేవత గంగమ్మకు సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆమె.. అధినాయకత్వానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు
Translate this News: