Andhra Pradesh : ఏపీలో తెలంగాణ ఉద్యోగుల రిలీవ్
ఏపీలో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి సొంత రాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది.
ఏపీలో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి సొంత రాష్ట్రానికి పంపేలా ఉత్తర్వులు ఇచ్చింది.
ఏపీలో రైతులకు విత్తన కొరత లేదని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా? అంటూ కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. విత్తనాల కొరతపై వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఇచ్చిన వివరణ తలా తోక లేనిదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవయవ దానం చేసిన పార్ధివ దేహాలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇలా జీవ దాతలుగా నిలిచిన వారికి గౌరవంగా వీడ్కోలు పలకడంతో పాటు వారి కుటుంబాలకు రూ.10 వేల పారితోషికాన్ని కూడా అందజేయనున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన మొదలు పెట్టేందుకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది.గ్రామ, వార్డు సెక్రటరీలను అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేలా కసరత్తు చేస్తుంది.కొత్తగా క్లస్టర్ విధానం అమల్లోకి తెచ్చే ప్రయత్నం మొదలు పెట్టింది.
సినీ లవర్స్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ‘కల్కి 2898AD’ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ తో పాటూ అదనంగా ఆరో షో వేసుకునేందుకు వెసలుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది.
వృద్దులు, దివ్యాంగులు, వితంతవులు, ఒంటరి మహిళలకు జులై ఒకటో తేదీ నుంచి పెంచిన మొత్తం ...ఏప్రిల్, మే, జూన్ నెలలకు వెయ్యి రూపాయలు చొప్పున కలిపి మొత్తం రూ. 7 వేలు అందించనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.
ఏపీ ప్రభుత్వం 40 మంది సలహాదారులను తొలగించింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా, నిన్న సజ్జలతో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేశారు. చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది.
ఏపీ ప్రభుత్వ కార్యాలయాలపై ప్రభుత్వం నిఘా పెట్టింది. కీలక సమాచారం మాయం అవకుండా చర్యలు చేపట్టింది. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేష్ సహా ఇతర నేతలపై కేసులు పెట్టిన కార్యాలయాలపై స్పెషల్ ఫోకస్ చేసింది. ఆయా ప్రభుత్వ కార్యాలయాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.
జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి ఏపీ సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. సచివాలయంలో తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు, వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దని స్పష్టం చేసింది.