AP Crime: ఏపీలో దారుణం.. పంపు బాయ్ ఫకృద్దీన్ను స్తంభానికి కట్టేసి కొట్టిన మేనేజర్లు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కుమ్మరవాండ్లపల్లిలో ఉన్న పెట్రోలు బంకులో పని చేస్తున్న పంపు బాయ్ బాబా ఫకృద్దీన్ రూ.23 వేలు తీసుకున్నాడని మేనేజర్లు అతని దుస్తులు ఊడదీసి టెలిఫోన్ స్తంభానికి కట్టేసి శారీరకంగా దాడి చేశారు.