దమ్ముంటే పట్టుకోరా షికావత్ || Dammunte Pattukora Shekhawat || Pushpa 2 || Allu Arjun || RTV
జానీ మాస్టర్ ను మీడియా వాళ్ళు పలుమార్లు 'మీ అరెస్టుకు అల్లు అర్జున్ కారణమా?' అని అడిగారు. దానికి ఆయన సమాధానం ఇవ్వకుండా అక్కడినుంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన చేష్టలు చూస్తుంటే అల్లు అర్జున్ వల్లే తాను జైలుకు వెళ్లానని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇస్తున్నాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సంధ్య థియేటర్ ఘనట నేపథ్యంలో 'పుష్ప2'టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది. 'దమ్ముంటే పట్టుకో షెకావత్' సాంగ్ను యూట్యూబ్ నుంచి తొలగించింది. సీఎం రేవంత్ రెడ్డి, పోలీసులను ఉద్దేశించే పాట రిలీజ్ చేశారని కామెంట్స్ రావడంతో T సిరీస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సంధ్య థియేటర్ ఘటన లో అల్లు అర్జున్ తప్పేం లేదని హీరోయిన్ సంజనా గల్రాని అన్నారు. కావాలని ఈ కేసులో ఆయన్ని నిందితుడిగా చూపిస్తున్నారని, అల్లు అర్జున్ థియేటర్కు రావడం ఇదే మొదటిసారి కాదని, అలాంటి ఘటనలకు అతన్ని బాధ్యుడిగా చూపడం అన్యాయమని ఆమె పేర్కొన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితురాలి కుటుంబానికి 2 కోట్ల ఆర్థిక సాయం అందించారు. అల్లు అర్జున్ కోటి రూపాయలు, మైత్రీ నిర్మాతలు, సుకుమార్ చెరో 50 లక్షలు అందజేశారు.
తొక్కిసలాటలో రేవతి చనిపోయిన తర్వాతనే.. అల్లు అర్జున్ థియేటర్ లోకి వచ్చాడంటూ ఈ రోజు ఉదయం నుంచి ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ అయ్యారు. తప్పుడు సమాచారంతో పోస్టులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
అల్లు అర్జున్ 'పుష్ప2' హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా 700 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యింది. బాలీవుడ్ సినిమా రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. ఈ రికార్డును ఇప్పట్లో మరో సినిమా బ్రేక్ చేయడం అసాధ్యమని బాలీవుడ్ ట్రేడ్ అంచనా .