BIG BREAKING: అక్షయ్ కుమార్ కారుకు రోడ్డు ప్రమాదం..
బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ సెక్యూరిటీ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. జుహులోని ఆయన ఇంటికి సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరికి గాయాలయ్యాయి.
బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ సెక్యూరిటీ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. జుహులోని ఆయన ఇంటికి సమీపంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరికి గాయాలయ్యాయి.
చైనా మాంజాతో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా వాటి అమ్మకాలు, వినియోగం ఆగటం లేదు. ఏకంగా హైకోర్టు చెప్పినా ఆగని చైనా మాంజా విక్రయాలు ఆగకపోవడంతో మరో ముగ్గురు ప్రాణపాయంలో చిక్కుకున్నారు. అమ్మకాలను హైకోర్టు నిషేధించిన నగరంలో విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఏ గల్లీలో చూసినా పిల్లలు పతంగులు(గాలిపటాలు) ఎగురవేస్తూ కనిపిస్తుంటారు. గాలిపటాలు ఎగురవేస్తూ సంతోషంగా గడపడం సరదాగానే ఉంటుంది. అయితే వాటికి చైనా మాంజా(దారం) వాడటమే ప్రాణాలను బేజారులో పడేస్తుంది.
సంగారెడ్డి జిల్లా కందిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కవలంపేట సమీపంలో ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
నెల్లూరు ఉలవపాడు బైపాస్ దగ్గర ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న 13 మంది మహిళలకు, కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కొందరు మహిళలు రోడ్డుపైనే తీవ్ర గాయాలతో స్పృహ తప్పి పడిపోయారు. వీరిలో ప్రస్తుతం నలుగురు మహిళల పరిస్థితి విషమంగా ఉంది.
ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సే ప్రాణాలు తీసింది. అదుపు తప్పిన అంబులెన్స్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మోటార్సైకిళ్లపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఓ జంట అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరులోని రిచ్మండ్ సర్కిల్ వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంటను చూసి కాలానికి కన్నుకుట్టింది. భవిష్యత్తులో బంగారు జీవితం గడపాలని కలలు కన్న వారి కలలన్నీ కల్లలయ్యాయి. పారాణి ఆరకముందే ప్రియురాలైన నవవధువు మృతిచెందగా..ప్రియుడైన వరుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.