Accident: జనాలపైకి దూసుకెళ్లిన వాహనం.. 20 మంది..
అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో దారుణం జరిగింది. శనివారం ఈస్ట్ హాలీవుడ్ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వాహనం ఏకంగా జనాలపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 20 మంది గాయాలపాలయ్యారు.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో దారుణం జరిగింది. శనివారం ఈస్ట్ హాలీవుడ్ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వాహనం ఏకంగా జనాలపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 20 మంది గాయాలపాలయ్యారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా ఒక కారు మహిళా టీచర్ పద్మావతిని ఢీకొట్టింది. దీంతో అటువైపుగా వెళ్లిన మంత్రి సత్యకుమార్ యాదవ్ గమనించి ఆమెను తన కారులో హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు
ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్ జిల్లాలో ఈరోజు సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మువానీ నుంచి బక్టా వెళ్తున్న కార్ అదుపు తప్పి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8మంది అక్కడక్కడే మృతి చెందారు.
వరంగల్ జిల్లా మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం ఆ శవాన్ని బంధువులకు అప్పగించారు. తీర అంత్యక్రియల సమయంలో అది తమది కాదని గుర్తించి సిబ్బందిపై మండిపడ్డారు.
ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విశాఖ నుంచి కాకినాడ వైపు వెళుతున్న లారీ టోల్ ప్లాజా వద్దకు రాగానే అదుపుతప్పి ఒకటవ కౌంటర్ నుంచి రెండవ కౌంటర్కు దూసుకెళ్లింది.
కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఓ కుటుంబం హైదరాబాద్ నుంచి కడప జిల్లా మైదుకూరు వెళ్తుండగా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ సమీపంలో వారి స్కార్పియో వాహనం ట్రాక్టర్ ని ఢీకొట్టింది.
తమిళనాడులో స్కూల్ వ్యాన్ను రైలు ఢీకొట్టడంతో స్పాట్లోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. వెంటనే వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న కారులో వరుడి(24)తో సహా 8 మంది మృతి చెందడం కలకలం రేపింది. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ బృందంతో వెళ్తున్న బొలెరో ఎస్యూవీ కారు నియంత్రణ కోల్పోయి ఓ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు సహా ఒకే కుటుంబానికి చెందిన 5 మంది చనిపోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.