Snake Found in Scanning Room: అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ లో (NTR Hospital) ఓ పేషెంట్ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్ స్కానింగ్ చేయాలని అనడంతో స్కానింగ్ రూమ్లో వెళ్లింది. అయితే, ఆ రూమ్ లో పసిరిక పాము దర్శనమిచ్చింది. కిటికీపై ఉన్న పసిరిక పామును చూసి వెంటనే షాక్ అయింది. వెంటనే వైద్య సిబ్బందికి తెలిపింది. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది పామును కొట్టి బయటపడేయంతో పేషెంట్లు ఊపిరి పీల్చుకున్నారు.
ntr district
Crime News: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం.. ఇద్దరు బాలికలు మృతి..!
NTR District: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారు దోనబండ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. పరిటాల క్రషర్స్ వద్ద ఉన్న నీటి కుంటలో పడి ఇద్దరు బాలికలు మృతి చెందారు. బట్టలు ఉతకటానికి వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. మృతులను లక్ష్మి (15), రాధ (14)గా స్థానికులు గుర్తించారు. ఈ బాలికల కుటుంబాలు 20 ఏళ్ల క్రితం ఒడిశా నుంచి వచ్చి ఎన్టీఆర్ జిల్లాలో జీవనం సాగిస్తున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు విగతజీవులుగా మారడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Crime News : వామ్మో.. ఈ ముసలోడు మామూలోడు కాదుగా.. ఏకంగా పుష్ప-3 సినిమాను చూపించాడు..!
NTR District : ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పుష్ప-3(Pushpa-3) సినిమాను ముందే చూపించాడు ఓ ముసలోడు. కోదాడ నుండి నందిగామకు స్కూటీలో పుష్ప సినిమాను తలపించేలా మద్యంను తరలిస్తున్నాడు. స్కూటీని ఏకంగా మద్యం షాపుగా మార్చేశాడు. తెలంగాణ(Telangana) నుండి ఆంధ్రా(Andhra Pradesh) కు స్కూటీలో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న మద్యంని నందిగామ పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.
Also Read: ముదిరిన మూఢ నమ్మకం.. పాము కాటుకు చనిపోయిన వ్యక్తిని గంగా నది ప్రవాహంలో వేలాడదీసి…!
నందిగామ ఏసీపీ రవికిరణ్(ACP Ravi Kiran) మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల(General Elections) నేపథ్యంలో భద్రత కట్టుదట్టం చేశామన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నుండి ఆంధ్రకు అక్రమంగా స్కూటీ ద్వారా మద్యం తరలిస్తున్నారని సమాచారంతో నందిగామ సీఐ హనీఫ్ వారి సిబ్బంది స్కూటీని స్వాధీనం చేసుకున్నారన్నారు. అందులో 100 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Kesineni Nani : చంద్రబాబుకు కేశినేని నాని సవాల్..!
Kesineni Nani Challenge : ఎన్టీఆర్ జిల్లా(NTR District) మైలవరంలో నూతన వైసీపీ(YCP) కార్యాలయం ప్రారంభం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయాన్ని ఎంపీ కేశినేని నాని(MP Kesineni Nani), మంత్రి జోగి రమేష్, ఇన్చార్జి సర్నాల తిరుపతిరావు యాదవ్, పరిశీలకులు అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేశారు ఎంపీ కేశినేని నాని. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కు కేశినేని నాని బహిరంగంగా సవాల్ విసిరారు.
చంద్రబాబుకు సవాల్..
చంద్రబాబు చేసిన అభివృద్దికి జగన్(YS Jagan) చేసిన అభివృద్ది చర్చకు తాను సిద్ధం అని ప్రకటన చేశారు. కనీసం ఒక సచివాలయం కట్టలేని వాడు అభివృద్ది గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ రోజు మైలవరంలో సభకు వచ్చిన వారికన్నా చంద్రబాబు సభలకు సగం కూడా రావటం లేదని ఎద్దేవా చేశారు. కుప్పంకు నీళ్ళు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు టీడీపీ(TDP) కి బీసీలు గుర్తుకు వస్తారని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్నికల తరువాత కనీసం గుర్తు ఉండవని కామెంట్స్ చేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడని.., వాడుకొని వదిలేసే రకమని మండిపడ్డారు. 40 ఏళ్ళ తరువాత రాజ్యసభలో టీడీపీ ఖాళీ అయిందన్నారు. 2024 ఎన్నికల తరువాత సొంత రాష్ట్రం వదిలి పారిపోవడం ఖాయమని అన్నారు.
Also Read : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను నమ్మితే అంతే..!
తరిమి కొట్టాలి..
ఈ సందర్భంగానే మంత్రి జోగి రమేష్(Minister Jogi Ramesh) మాట్లాడుతూ.. మైలవరంలో పోటీకి వసంత – ఉమా కలసి బీ ఫామ్ తీసుకొని పోటి చేయాలని ఎద్దేవా చేశారు. తమ్ముడు తిరుపతిరావు యాదవ్ ఓడించండం ఖాయమని ఇది నా ఛాలెంజ్ అన్నారు. చంద్రబాబు – పవన్ తోడు దొంగలను వారిని తరిమి కొట్టాలని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు తలపైకెత్తి తిరేగేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దే అని అన్నారు. కుప్పం – మంగళగిరిలో తండ్రి కొడుకుల ఓటమి ఖాయమని అన్నారు.
YCP Mla : ప్రజాప్రతినిధులే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి.. సొంతపార్టీ పైనే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
Vasantha Krishna Prasad: సొంత పార్టీ ఎమ్మెల్యేనే వైసీపీ (YCP) ప్రభుత్వం పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలం నుంచి పార్టీ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) పార్టీ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారారు. ఈ క్రమంలో ఆయన మంగళవారం నాడు వెలగలేరులోని ప్రభుత్వ ఆసుపత్రి భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ క్రమంలో ఆయన సొంత పార్టీ మీదే విమర్శలు కురిపించారు. సంక్షేమంతో పోల్చుకుంటే..అభివృద్ధిలో ముందుకు సాగలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు రాక సొంత పార్టీ ప్రజా ప్రతినిధులే ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తన భవిష్యత్తు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు.
నేను ఆర్చలేక, తీర్చలేక…
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో ఉందని తెలిపారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో చాలా మంది వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోయి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. బిల్లుల కోసం చాలా మంది కాంట్రాక్టర్లు, వైసీపీ నేతలు రోజంతా నా కార్యాలయం చుట్టు తిరుగుతున్నారని తెలిపారు. 20వేల ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఆ స్థలాలకు అభివృద్ధి నిమిత్తం ఫిల్లింగ్ చేసిన ఏ కాంట్రాక్టర్ కి ఒక్క రూపాయి డబ్బు రాలేదుకాంట్రాక్టర్లంతా రోజూ నా ఆఫీస్ చుట్టూ తిరగడం జరుగుతుంది. ఇప్పుడు నిధులు తెచ్చినా చేసే వాళ్ళు లేరు,చేసినా వాళ్ళను నేను ఆర్చలేక, తీర్చలేక పోతున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తాత ఇచ్చిన మామిడి తోట కూడా…
అధికారంలోకి వచ్చిన మొదటి మూడు సంవత్సరాలు కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకుని వచ్చి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని, వాటికి సంబంధించిన బిల్లులు ఏవీ రాక గడిచిన ఏడాదిన్నరగా మేము ఎలాంటి నిధులు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు చేయట్లేదని వసంత ఆవేదన వ్యక్తం చేశారు. 10సంవత్సరాలు ప్రాణం పెట్టి పని చేసిన వైసీపీ కార్యకర్తకి 7కోట్ల డ్రైన్లు,రోడ్లు కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తే అప్పులపాలై వాళ్ళ తాత ఇచ్చిన మామిడి తోట కూడా అమ్ముకున్నాడు
దీనికి తగినట్లు తన భవిష్యత్తు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుందని వసంత అన్న మాటలు ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. చాలా కాలం నుంచి ఆయనకు జోగి రమేశ్కు విభేధాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
పైన డబ్బులు లేకుండా నేను ఎన్ని రోజులు పని చేసేది?మానసికంగా ఇదంతా కష్టంగా ఉందిఎప్పుడు తెల్దారుతుందా,ఎప్పుడు చీకటి పడుతుందా అని రోజూ ఎదురు చూడడమే శాసనసభ్యుల పని అంటూ వసంత విచారం వ్యక్తం చేశారు. చాలా కాలం నుంచి వసంత పార్టీని వీడి మరో పార్టీకి వెళ్తున్నారనే ప్రచారానికి ఆయన చేసిన వ్యాఖ్యలు ఊతమిచ్చేలా ఉన్నాయి.
Also read: అయోధ్య రామ మందిరం.. 500 సంవత్సరాల గాయానికి కుట్టు లాంటిది : అమిత్ షా!
ఎన్టీఆర్ జిల్లాలో విషాదం..కానిస్టేబుల్ మృతి.. అసలు ఏం జరిగిందంటే..?
NTR District: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆగిరిపల్లిలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ గంధం నరేంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రభుత్వ లాంఛనాలతో గంధం నరేంద్ర భౌతిక కాయానికి పోలీసులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.
కానిస్టేబుల్ గంధం నరేంద్ర స్వగ్రామం ఎ. కొండూరు మండలం పోలిశెట్టిపాడు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు నరేంద్ర. కష్టపడి చదివి పోలీసు శాఖలో పనిచేయాలనే లక్ష్యంతో కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికయ్యారు. నరేంద్రకు భార్య, మూడేళ్ల కుమారుడు, ఏడు నెలల కుమార్తె ఉన్నారు. వివాదరహితుడిగా, సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్నాడు నరేంద్ర. వినాయక పండుగా సందర్భంగా కానిస్టేబుల్ నరేంద్రకు ఆగిరిపల్లిలో డ్యూటీ వేసారు పోలీస్ అధికారులు. అయితే, వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన దాడిలో కానిస్టేబుల్ గంధం నరేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన అధికారులు నరేంద్రను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా,నరేంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఎంతో వినయంగా ఉండే కానిస్టేబుల్ చనిపోవడంతో పోలీస్ శాఖలో విషాదాలు అలుముకున్నాయి. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం నరేంద్ర భౌతిక కాయాన్ని స్వగ్రామం పోలిశెట్టిపాడు తీసుకు వచ్చారు. పోలిశెట్టిపాడు గ్రామంలో అంత్యక్రియలకు తిరువూరు శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణనిధి, ఎన్టీఆర్ జిల్లా డీసీపీ అజిత వేజెండ్ల IPS, ఏలూరు ఏఎస్పి శేఖర్ , ఎనిమిది మండలాల ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొని గంధం నరేంద్ర భౌతిక గాయానికి ప్రభుత్వ లాంఛనాలతో పోలీసులు గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహించారు. జోహార్ నరేంద్ర అంటూ నినాదాలు చేస్తూ ఘనంగా తుది వీడ్కోలు పలికారు. కానిస్టేబుల్ నరేంద్ర కుటుంబంకు అండగా ఉంటామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.
Also Read : నట్టేట ముంచిన గూగుల్ మ్యాప్..ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లు!