/rtv/media/media_files/2025/05/02/3RPvHyrt4y4ka8y3Bf1v.jpg)
YouTuber suicide
YouTuber Madhumita : ఏపీకి చెందిన ప్రముఖ తెలుగు యూట్యూబర్ వెంపాటి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా మధుమతి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజక వర్గంలోని విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామం లో ఉండే తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా.. అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె మృతికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.
Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్లో టెన్షన్ టెన్షన్..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట మండల పరిధిలోని ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి (22) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేది. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమెకు లక్షల సంఖ్యలో అభిమానులున్నారని తెలుస్తోంది. తన యూట్యూబ్, ఇన్స్టా గ్రామ్లో లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే మధుమతికి అప్పటికే వివాహం అయిన ప్రతాప్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు ఇద్దరి మధ్య వివాహేతర బంధానికి దారి తీసింది.
Also Read: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..
అయితే, ఉన్నట్టుండి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన మధుమతి అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏమోచ్చింది అనేది తెలియాల్సి ఉంది. కాగా, తమ కుమార్తె చావుకు తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన బోల్లిపోగు ప్రతాప్ కారణమని, ఆయనే మా కుమార్తె ను చంపి ఉరివేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మధుమిత తల్లిదండ్రులు,వెంపాటి పాపారావు,లావణ్య. ప్రతాప్ టార్చర్ చేసి హత్య చేశాడని తమ కూతురు మరణానికి ప్రతాప్ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని మధుమతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?