Stock Market Today: కొత్త నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లు తమ పతనాన్ని కొనసాగిస్తున్నాయి. బేర్ పంజా మార్కెట్లను భారీ నష్టాల్లోకి లాగేస్తోంది. ఈ తరుణంలో ప్రధానంగా దేశీయ ఈక్విటీ ఇన్వెస్టర్లు ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నారు. ప్రీ-ఓపెన్ సెషన్ నుంచే మార్కెట్లు ఒత్తికి లోనయ్యాయి. ఈ సెషన్స్లోనే సెన్సెక్స్ (Sensex) 180 పడిపోగా, నిఫ్టీ (Nifty) 0.30 శాతం నష్టాలతో ఉంది. దీంతో సెన్సెక్స్ 450 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 125 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 465 పాయింట్ల నష్టంతో 65,047 దగ్గర, నిష్టీ 131 పాయింట్ల నష్టపోయి 19,397 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 83.24 దగ్గర మొదలైంది.
పూర్తిగా చదవండి..Stock Market Today:దేశీ స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు…అసలేం జరుగుతోంది?
దేశీ మార్కెట్లు గత కొన్ని రోజులుగా నష్టాలను కొనసాగిస్తున్నాయి. ఈ పతనం బుధవారం కూడా కొనసాగింది. ప్రారంభమవడమే స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 465 పాయింట్ల నష్టంతో 65,047 దగ్గర, నిష్టీ 131 పాయింట్ల నష్టపోయి 19,397 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి.
Translate this News: