IPL 2025: కోలకత్తాకు అరెంజ్ అలెర్ట్..ఐపీఎల్ మొదటి మ్యాచ్ జరుగుతుందా?

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నఐపీఎల్ 2025 ఈరోజు నుంచి మొదలవ్వనుంది. అయితే ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ఎదురవనుందా అంటే అవుననే అంటున్నారు. మొదటి మ్యాచ్ కు వర్షం గండం ఉందని చెబుతున్నారు.

New Update
kolkatha

Kolkatha Eaden Gardens

 

ఏడాదిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 మొదలయ్యే రోజు వచ్చేసింది. ఈరోజు మొదటి మ్యాచ్ కోలకత్తా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాంలెజర్స్ మధ్యన జరగనుంది.  ఈరోజు కోలకత్తాలో ఈడెన్ గార్డెన్స్ లో మొదట గ్రాండ్ గా ఓపెనింగ్ సెర్మనీ...తరువాత మ్యాచ్ జరగనుంది. అయితే ఇవననీ అనుకున్నట్టు జరుగుతాయా లేదా అనేది అనుమానంగా మారింది. కోలకత్తాలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. దాంతో పాటూ అక్కడ ఆరెంజ్ అలెర్ట్ కూడా ప్రకటించింది వాతావరణశాఖ. దీంతో మొదటి మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది డౌట్ లో పడింది. 

కోలకత్తాలో ఆరెంజ్ అలెర్ట్..

కోలకత్తాలో నిన్న కూడా వర్షం భారీగా పడింది. నిన్న సాయంత్రం నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ రెండు జట్లూ ప్రాక్టీస్ చేస్తుండగా.. 6 గంటలకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభం అయింది. దాదాపు కోలకత్తా అంతా వర్షం కురిసింది.  దీంతో ఇరు జట్లూ ప్రాక్టీస్ కు ప్యాక్ అప్ చెప్పాయి. స్టేడియం సిబ్బంది వెంటనే తేరుకుని పిచ్ పైన, గ్రౌండ్ లో కవర్స్ పరిచారు. దీని వలన కనీసం పిచ్ తడిగా అయిపోకుండా ఉంది. కోలకత్తాలో  న్యూ ఎలిపోర్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ రెండురోజులు తీవ్రమైన గాలులు, ఉరుములు మెరుపులు, పిడుగులతో పాటు వడగళ్ల వాన పడే అవకాశం ఉందని ప్రకటించింది. దీంతో మ్యాచ్ తో పాటూ ఓపెనింగ్ సెర్మనీ కూడా జరగదేమో అని అనుమానంగా ఉంది. ఈరోజు సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అంతకు ముందు సెలబ్రిటీలతో ఈవెంట్ జరగాల్సి ఉంది. 

today-latest-news-in-telugu | ipl-2025 | kolkata | match | rain 

Also Read: TS: తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్..అధికారులను అప్రమత్తం చేయాలన్న సీఎం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు