విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్లో అదరగొడుతున్నాడు. ప్రతి మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ చేస్తున్నాడు. ఏ జట్టుతో మ్యాచ్ జరిగినా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ప్రస్తుతం అతడు ఆడుతున్న ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ అన్ని ఫార్మట్లలో తన కెప్టెన్సీ భాద్యతల్ని వదిలేయడం గురించి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Also Read: ఛీ ఛీ.. అక్కవేనా నువ్వు..? సొంత చెల్లెళ్లని లవర్తో రేప్ చేయిస్తావా..!
ఆ కారణంతోనే తప్పుకున్నా
అప్పట్లో విరాట్ తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి బయటకు వచ్చేయడం సంచలనంగా మారింది. అయితే అప్పుడు తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తాజాగా కోహ్లీ తెలిపాడు. ‘ఆర్సీబీ బోల్డ్ డైరీస్’ పాడ్కాస్ట్లో పాల్గొన్న అతడు.. ఈ విషయాలను పంచుకున్నాడు. ఒకానిక సమయంలో తాను ఎంతో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు తెలిపాడు. టీమ్ఇండియాకు దాదాపు 7- 8 సంవత్సరాలు కెప్టెన్గా వ్యవహరించానని.. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 9 ఏళ్లు సారథిగా ఉన్నానని అన్నాడు.
Also Read: హైదరాబాద్ లేడీసా మజాకా.. బ్లౌజ్ ఆఫర్ చూడగానే పరుగో పరుగు - కిక్కిరిసిపోయిన షాప్
తాను ఆడిన ప్రతి మ్యాచ్లోనూ తన బ్యాటింగ్ పై అభిమానులు, క్రికెట్ ప్రియులు ఎక్కువగా అంచనాలు పెట్టుకునే వారని.. అదే తనలో తీవ్రమైన ఒత్తిడికి కారణమైందని పేర్కొన్నాడు. ఆ ఒత్తిడి కారణంగా ఒక్కోసారి మంచి ప్రదర్శన చేయలేకపోయేవాడినని తెలిపాడు. అందువల్లనే తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి మెల్లిమెల్లిగా బయటకు వచ్చేశానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఫ్రీబడ్ అయిపోయానని.. స్వేచ్ఛగా ఆడగలుతున్నానని పేర్కొన్నాడు. ఈ ఐపీఎల్లోనూ మంచిగా ఆడుతున్నానని.. చక్కగా పరుగులు రాబడుతున్నానని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
Also Read: గుండెపోటుకు అరటిపండుతో చెక్..రోజుకు 3 తినండి
కెప్టెన్సీ నుంచి ఎప్పుడు తప్పుకున్నాడంటే?
విరాట్ కోహ్లీ 2021 ప్రపంచకప్ తర్వాత టీ20లలో కెప్టెన్గా తన బాధ్యతలకు గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. అది మాత్రమే కాకుండా మరికొద్ది రోజులకు ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. వీటన్నింటికి అసలు కారణాన్ని అతడు ఇప్పుడు చెప్పుకొచ్చాడు.
Also Read: తల నరికి.. బీజేపీ మహిళా నేత దారుణ హత్య!
virat-kohli | latest-telugu-news | telugu-news