Crime Story: ఛీ ఛీ.. అక్కవేనా నువ్వు..? సొంత చెల్లెళ్లని లవర్‌తో రేప్ చేయిస్తావా..!

కాన్పూర్‌లోని ఫజల్‌గంజ్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక అక్క తన ఇద్దరు చెల్లెళ్లను ప్రియుడి స్నేహితులతో రేప్ చేయించింది. తమ ప్రేమ, శారీరక సంబంధం గురించి ఇంట్లో చెప్పేస్తారని భావించి ఈ దారుణానికి పాల్పడింది. వారు చెప్పేయడంతో ఆత్మహత్య చేసుకుంది.

New Update
older sister who raped her younger sisters with her boyfriend friends

older sister who raped her younger sisters with her boyfriend friends

Crime Story: కాన్పూర్‌లోని(Kanpur) ఫజల్‌గంజ్‌లో(Fazalganj) దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక అక్క తన ఇద్దరు చెల్లెళ్లను తన ప్రియుడు, అతడి స్నేహితుడితో అత్యాచారం చేయించడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని వాళ్లిద్దరూ ఇంట్లో చెప్పడంతో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఫ్యామిలీకి తెలిసిపోయిందన్న భయంతో నిందితురాలు సోదరి చివరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

ఇది కూడా చదవండి: గుండెపోటుకు అరటిపండుతో చెక్‌..రోజుకు 3 తినండి

చెల్లెళ్లను రేప్ చేయించిన అక్క

ఈ ముగ్గురు సోదరీమణులకు తండ్రి, వృద్ధ అమ్మమ్మ ఉన్నారు. తల్లి అనారోగ్యం కారణంగా మరణించింది. అనంతరం అక్కకు పొరుగింటి అబ్బాయితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. అది కాస్త శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ ప్రేమ జంట ఎన్నో సార్లు శృంగారంలో పాల్గొంది. ఈ విషయం ఇద్దరు చెల్లెళ్లకు తెలిసిపోయింది. దీంతో వారు తమ అక్కను తిట్టారు. అక్కడితో ఆగకుండా ఇంట్లో తండ్రికి, అమ్మమ్మకు చెప్పేస్తామని తమ అక్కకు తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఆ వ్యాధులు ఉన్నవారు పుచ్చకాయ తింటే డేంజర్.. ఈ విషయాలు మీకు తెలుసా?

దీంతో తమ ప్రేమ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని అక్క దుర్మార్గపు నిర్ణయం తీసుకుంది. తన పరువు పోకుండా ఉండటానికి ఆమె తన ప్రియుడు, అతడి స్నేహితుడితో ఇద్దరి చెల్లెళ్లపై అత్యాచారం చేయించింది. అక్కడితో ఆగకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని లేదా ఆత్మహత్య చేసుకుంటానని అక్క ఇద్దరు చెల్లెళ్లను బెదిరించింది. కానీ బాధిత సోదరీమణులు తమ అమ్మమ్మకు అన్నీ చెప్పేశారు. 

ఇది కూడా చదవండి: తల నరికి.. బీజేపీ మహిళా నేత దారుణ హత్య!

దీంతో ఈ విషయం తెలిసి అక్క భయంతో వణికిపోయింది. ఏం చేయాలో తెలియక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం అమ్మమ్మ ఫిర్యాదు మేరకు ఫజల్‌గంజ్ పోలీసులు మృతురాలి (అక్క) ప్రియుడు, అతని స్నేహితులపై అత్యాచారం ఆరోపణలపై ఫిర్యాదు నమోదు చేశారు. అదే సమయంలో చెల్లెళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత, వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసు దర్యాప్తు జరుగుతోంది. 

ఇది కూడా చదవండి: రోజూ ద్రాక్ష పండ్లు తింటే ఎండలో తిరిగినా ఏమీ కాదా?

 

crime news | latest-telugu-news | Latest crime news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు