/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/crime-1.jpg)
thamilanadu crime news
Crime News: తమిళనాడులో బీజేపీ మహిళా నాయకురాలు శరణ్య దారుణ హత్యకు గురవడం తీవ్ర సంచలనంగా మారింది. మధురై సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన శరణ్యను గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. శరణ్య తన ఇంటికి వెళ్తుండగా ఆమెను వెంటాడిన దుండగులు ఆయుధాలతో దాడికి దిగారు. తలనరికి హత్య చేయడం తమిళనాడులో రాజకీయ ఉత్కంఠకు దారి తీసింది. ప్రజా ప్రాతినిధ్యం ఉన్న మహిళపై ఇలాంటి దాడి జరగడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. స్థానికంగా ఈ హత్యపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
హత్యకు పాల్పడటానికి..
శరణ్య గతంలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. 2023లో తమిళనాడు మంత్రి పళనివేల్ త్యాగరాజన్ మధురై పర్యటనలో ఉన్న సమయంలో ఆమె కారుపై చెప్పులు విసిరిన ఘటన సంచలనం సృష్టించింది. ఆ ఘటన నేపథ్యంలో ఆమెతో పాటు పలువురు బీజేపీ నాయకులు అరెస్టు అయ్యారు. అప్పటి నుంచే ఆమె రాజకీయ ప్రత్యర్థులతో పాటు అధికార పక్షానికి వ్యతిరేకంగా నిలిచినవారిలో ఒకరిగా ముద్రపడ్డారు. ఆమెపై హత్యకు పాల్పడటానికి రాజకీయ కక్షలే కారణమా లేదా వ్యక్తిగత కారణాలమా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. దర్యాప్తును వేగవంతం చేసి కారణాలను వెలికి తీయాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: వేసవిలో ఈ రంగు బట్టలు వేసుకుంటే కూల్గా ఉంటుంది
శరణ్య హత్య ఘటనపై కేసు నమోదు చేసిన మధురై పోలీసులు, చుట్టుపక్కల సీసీ టీవీ ఫుటేజ్ను సేకరించడంతోపాటు, ఆమెకి ఉన్న వ్యక్తిగత, రాజకీయ సంబంధాలను పరిశీలిస్తున్నారు. ఈ హత్యను రాజకీయంగా ప్రేరితమైనదిగా కొందరు అభివర్ణిస్తుండగా, ఇంకొందరు మాత్రం ఇది వ్యక్తిగత వేధింపుల పరంగా జరిగిందని భావిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిరసనలకు దిగుతున్నారు. ఒక మహిళా దారుణ హత్యకు గురికావడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ హత్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు... తేదీలు ఇవే
( latest-news )