Sunil Gavaskar: 78 వేల సంవత్సరాలైనా మిల్లీమీటర్‌ భూమిని కూడా లాక్కొలేరు!

పహల్గాం దాడి గురించి క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.గత 78 ఏళ్లలో ఒక్కమిల్లీమీటర్‌ భూమినైనా కదల్చగలిగరా?వచ్చే 78 వేల సంవత్సరాల తర్వాతైనా ఎలాంటి మార్పులు ఉండవని ఆయన భారతీయులను ఉద్దేశించి అన్నారు.

New Update
gavaskar

gavaskar

Sunil Gavaskar: జమ్మూ కశ్మీర్‌ లోని పహల్గాంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది పర్యాటకలు ప్రాణాలు కోల్పోయారు.ఇప్పటికే ఈ ఘటన పై ప్రపంచ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తమైంది.ప్రధాని మోడీ గట్టి చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.పలువురు భారత మాజీ ,ప్రస్తుత క్రికెటర్లు తమ సంతాపం తెలియజేశారు.

Also Read:Telangana: నిప్పుల కుంపటిల రాష్ట్రం.. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు.బెంగళూరు వేదికగా జరిగిన ఆర్సీబీ, ఆర్‌ఆర్‌ మ్యాచ్‌ అనంతరం సునీల్‌ గావస్కర్‌ ఉగ్రదాడిని ఖండిస్తూ స్పందించారు.ఉగ్రవాదులు వారి మద్దతుదారులు 78 ఏళ్లలో సాధించింది ఏమీ లేదని,భవిష్యత్తులోనూ ఎలాంటి మార్పు ఉండదని పాక్‌ కు పరోక్షంగా చురకలంటించారు.

Also Read:Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్‌..  ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.ఇది భారతీయులందరి పైనా ప్రభావం చూపిస్తుంది.ఈ సందర్భంగా ఉగ్రవాదులను,వారికి మద్దతుగా నిలిచే వారిని ఒక ప్రశ్న అడుగుదామనుకుంటాన్నా..ఇదంతా ఏం సాధించడానికి చేస్తున్నారు?గత 78  ఏళ్లలో ఒక్కమిల్లీమీటర్‌ భూమినైనా కదల్చగలిగరా?వచ్చే 78 వేల సంవత్సరాల తర్వాతైనా ఎలాంటి మార్పులు ఉండవు.

 

మరి ఎందుకు ప్రశాంతంగా జీవించకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మనం మరింత ధృఢంగా ముందుకు సాగాలనేదే నా విజ్ఙాపన అని గావస్కర్‌ వెల్లడించారు.

Also Read: Tamil Nadu Train Accident: తప్పిన ఘోర రైలు ప్రమాదం.. పట్టాలపై బోల్ట్‌లు పీకేసి..!

Also Read: Pahalgam Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో హమాస్ హస్తం..ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్

cricket | sports | latest-news

Advertisment
Advertisment
తాజా కథనాలు