/rtv/media/media_files/2025/04/29/IY0bgrupAbRzZyjvb8d3.jpg)
Shikar Dhawan
జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులను టార్గెట్ చేసి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాక్, భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ భారత సైన్యాన్ని కించపర్చేలా మాట్లాడాడు. ఉగ్రదాడి తర్వాత భారత్ అంతా కూడా బాలీవుడ్ను నిందించింది. కానీ భారత్ సైన్యం మాత్రం ఉగ్రదాడిని ఆపలేకపోయిందన్నాడు. అఫ్రిదీ వ్యాఖ్యలపై నెటిజన్లు అందరూ కూడా మండిపడ్డారు.
ఇది కూడా చూడండి: Russia: రష్యా సంచలన నిర్ణయం.. ఉక్రెయిన్లో కాల్పుల విరమణ ప్రకటన
Kargil mein bhi haraya tha, already itna gire hue ho aur kitna giroge, bewajah comments pass karne se acha hai apne desh ki taraqqi mai dimag lagao @SAfridiOfficial. Humein hamari Indian Army par bohot garv hai. Bharat Mata Ki Jai! Jai Hind!https://t.co/5PVA34CNSe
— Shikhar Dhawan (@SDhawan25) April 28, 2025
ఇది కూడా చూడండి:Waqf Board Assets: వక్ఫ్ ఆస్తులు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ.. కేంద్రం కీలక ప్రకటన
దేశ పరిస్థితిని ఎలా మెరుగు పరచుకోవాలనే..
ఈ క్రమంలో ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పందించాడు. ఇంకా దిగజారవద్దు అంటూ.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. పాక్ దేశాన్ని మేం కార్గిల్ యుద్ధంలో ఓడించామనే విషయాన్ని మరిచిపోయారా? ఇప్పటికే మీరు దారుణంగా పతనమయ్యారు? ఇంకా ఎంత వరకు దిగజారుతారు? ఇలాంటి మాటలు కాకుండా.. మీ దేశ పరిస్థితిని ఎలా మెరుగు పరచుకోవాలనే విషయంపై దృష్టి పెట్టండి. ఇండియన్ ఆర్మీపై దేశమంతా కూడా గర్వపడుతున్నామని ధావన్ స్పందించారు.
ఇది కూడా చూడండి: Pak-India:భారత్తో ఉద్రిక్తతల వేళ పాక్కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!