/rtv/media/media_files/2025/10/20/rohit-sharma-2025-10-20-07-37-05.jpg)
Rohit Sharma
ఆస్ట్రేలియాతో పెర్త్లో జరిగిన తొలి వన్డే మ్యాచ్(IND Vs AUS ODI Series 2025)లో భారత స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ(rohith-sharma) అంతర్జాతీయ క్రికెట్లో ఒక అతి పెద్ద రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్ 'హిట్మ్యాన్' కెరీర్లో 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. దీని ద్వారా అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఐదో భారతీయ క్రికెటర్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత దాదాపు ఏడు నెలల విరామం అనంతరం అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి వచ్చిన రోహిత్ శర్మకు ఇది ఎంతో ప్రత్యేకమైన మ్యాచ్. 2007లో టీమిండియాలోకి అడుగుపెట్టిన రోహిత్, మూడు ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) కలిపి 500 మ్యాచ్ల మైలురాయిని చేరుకున్నాడు. ఈ అరుదైన ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ (664), విరాట్ కోహ్లీ (550), ఎం.ఎస్. ధోని (538), రాహుల్ ద్రావిడ్ (509) తర్వాత రోహిత్ చోటు సంపాదించాడు. ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 11వ ఆటగాడిగా కూడా రోహిత్ నిలిచాడు.
Also Read : విరాట్ కోహ్లీ ఫామ్పై అర్ష్దీప్ సింగ్ సంచలన కామెంట్స్..
STAR SPORTS POSTER FOR ROHIT SHARMA 500* IN INTERNATIONAL CRICKET...!!! 🇮🇳 pic.twitter.com/aj9kTL2jJo
— Johns. (@CricCrazyJohns) October 16, 2025
రికార్డుతో పాటు నిరాశ:
అయితే, ఈ చారిత్రక మ్యాచ్లో రోహిత్ శర్మ బ్యాటింగ్లో నిరాశపరిచాడు. ఆస్ట్రేలియా పేసర్ల దాటికి కేవలం 8 పరుగులు (14 బంతుల్లో) మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అతడు జోష్ హేజిల్వుడ్ బౌలింగ్లో రెన్షాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కీలకమైన ఈ మైలురాయి మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (డకౌట్) ఇద్దరూ తక్కువ స్కోర్లకే ఔటవ్వడంతో భారత అభిమానులు కొంత నిరాశకు లోనయ్యారు. వర్షం కారణంగా 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారత్పై విజయం సాధించింది.
Also Read : టీమిండియా ఓటమి.. దీపావళికి ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్!
రోహిత్ కెరీర్ విశేషాలు:
500 మ్యాచ్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో 49 సెంచరీలు, 108 అర్ధ సెంచరీలతో కలిపి 19,700 పరుగులకు పైగా సాధించాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా, అలాగే అత్యధిక టీ20 అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఈ చారిత్రక మైలురాయిని చేరుకోవడం ద్వారా రోహిత్ శర్మ భారత క్రికెట్ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఈ సిరీస్లో రాబోయే మ్యాచ్లలో రోహిత్ శర్మ మరిన్ని పరుగులు చేసి, జట్టును విజయపథంలో నడిపించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Follow Us