/rtv/media/media_files/2025/10/20/arshdeep-singh-talks-about-virat-kohli-fam-after-ind-vs-aus-1st-odi-2025-10-20-09-28-49.jpg)
Arshdeep Singh talks about virat kohli fam after ind vs aus 1st odi
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్లో తొలి మ్యాచ్ అక్టోబర్ 19న పెర్త్లో జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ బ్యాట్ విఫలమైంది. అతడు 8 బంతుల ఆడి ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తాడని అంతా భావించినప్పటికీ, మిచెల్ స్టార్క్ చేతిలో డకౌటయ్యాడు. మ్యాచ్ తర్వాత, అర్ష్దీప్ సింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. అక్కడ కోహ్లీ డకౌట్ అవ్వడంపై వచ్చిన విమర్శలకు ధీటైన జవాబిచ్చాడు.
Arshdeep Singh talks about virat kohli
Arshdeep Singh expresses strong belief in Virat Kohli's ability to perform in the ongoing ODI series against Australia 🙌#INDvsAUS#ArshdeepSingh#ODI#ViratKohli#CricketTwitterpic.twitter.com/PSID9tg3Uu
— InsideSport (@InsideSportIND) October 19, 2025
విరాట్ కోహ్లీ 0 పరుగులకే ఔటైన తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన ఒక జర్నలిస్ట్ అర్ష్దీప్ సింగ్ను ఒక ప్రశ్న అడిగారు. దానికి ఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సరైన సమాధానమిచ్చాడు. ''ఫామ్ అనేది అతనికి కేవలం ఒక పదం మాత్రమే. అతను భారతదేశం తరపున 300కు పైగా వన్డేలు ఆడాడు. ఎలా ఆడాలి, ఎలా పుంజుకోవాలో అతనికి బాగా తెలుసు. అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం మాకు ఒక అదృష్టం. ఈ సిరీస్లో అతని నుంచి చాలా పరుగులు వస్తాయని నేను భావిస్తున్నాను." అని చెప్పుకొచ్చాడు.
Perth, Australia: Skipper Mitch Marsh leads from the front and scores 46 not out as Australia beat India by 7 wickets (via DLS method) in the 1st ODI at the Optus Stadium in Perth
— IANS (@ians_india) October 19, 2025
Indian fast bowler Arshdeep Singh says, "We are giving our best; some results will go in our… pic.twitter.com/x4NT70RzuR
ఒక మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడిని విమర్శించడం సరికాదని.. అతని అనుభవం, సామర్థ్యం ఈ సిరీస్లో తప్పకుండా కనిపిస్తాయని అర్ష్దీప్ బలంగా పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్ గురించి అడిగినప్పుడు అర్ష్దీప్ మాట్లాడుతూ.. "అతను ఆడుతున్న ఫార్మాట్ పరంగా, అతను దానిపై ప్రావీణ్యం సంపాదించాడు. కాబట్టి దాని గురించి అతను ఎలా భావిస్తున్నాడో నాకు తెలియదు." అని చెప్పుకొచ్చాడు.
ఇక వర్షం కారణంగా మ్యాచ్ను 26 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 14 బంతుల్లో 8 పరుగులు చేయగా, శుభ్మాన్ గిల్ 18 బంతుల్లో 10 పరుగులు చేశాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన కెఎల్ రాహుల్ 31 బంతుల్లో 38 పరుగులు చేశాడు. లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా కేవలం 21.1 ఓవర్లలోనే మ్యాచ్ను గెలుచుకుంది.