/rtv/media/media_files/2025/05/02/akD2BMUbg3ki6vpKEiv5.jpg)
Asiacup2025
ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఆగస్టులో జరగబోయే బంగ్లాదేశ్ సిరీస్ ను బీసీసీఐ రద్దు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. భారత్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టూర్ ను క్యాన్సిల్ చేసుకోవడమే ఉత్తమమని బీసీసీఐ ఆలోచిస్తుందట. కాగా ఆగస్టులో బంగ్లాదేశ్ తో భారత్.. మూడు వన్డేలతో పాటుగా, రెండు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అటు సెప్టెంబర్లో జరగనున్న ఆసియా కప్ కూడా రద్దైనట్లుగా వార్తలు వస్తున్నాయి.
Also Read: Phalgam Attack: పాపం పాక్.. సొంత దేశం పేరెత్తడానికే భయపడుతున్న స్థానిక సెలబ్రెటీలు!-VIDEO
Also Read: Pahalgam Attack ఉగ్రదాడితో కఠిన చర్యలు.. పాకిస్థాన్ స్టార్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్..!
Asia Cup 2025 in Doubt
— cricketpredicta (@cricpredicta) May 2, 2025
Terror attack in Pahalgam raises major security concerns; tournaments are now unlikely.
Official confirmation awaited.
Scheduled for September, with India as a likely host.#IndianSportsFans #CricketPredicta #IPL2025 #AsiaCup #CricketTwitter #BCCI pic.twitter.com/5CDMw4FrbI
బీసీసీఐ ఇష్టపడటం లేదు
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దారుణంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆసియా కప్లో పాకిస్థాన్తో ఆడటానికి బీసీసీఐ ఇష్టపడటం లేదు. కాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ లు ఉండబోవని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 2008 తర్వాత టీమిండియా పాకిస్థాన్ లో పర్యటించని విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా పాక్ లో ఏ ఒక్క మ్యాచ్ ఆడని టీమిండియా..దుబాయ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ లో గెలిచి టైటిల్ గెలుచుకుంది.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
Also Read: Anu Aggarwal: నా మూత్రం నేనే తాగిన.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు: నటి సంచలనం!
india | bangladesh | Asia cup 2025 | bcci | telugu-news