/rtv/media/media_files/2025/05/02/pkXVQjJoHelk8eZpV9YU.jpg)
pakistan actor Jannat Mirza publicly refused to support pakistan
Phalgam Attack: కాశ్మీర్(Kashmir) పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్థాన్(India- Pakistan) మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్థాన్ పై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాటు, పాకిస్థాన్ విమానాలు భారత్ లో ల్యాండ్ అవకుండా నిషేధం విధించింది. ఇది మాత్రమే కాదు ఇండియాలోని పాకిస్థాన్ యాక్టర్లను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు వ్యక్థమవుతున్నాయి.
Also Read: రేవంత్ సర్కార్కు బిగ్ షాక్.. GO 111 ఉల్లంఘనపై హైకోర్టు నోటీసులు!
ఇప్పటికే పలు పాకిస్థాన్ యాక్టర్ల(Pakistan Actors) ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ భారతదేశంలో బ్లాక్ అయ్యాయి. వారి ప్రొఫైల్ ఓపెన్ చేయగా.. "Account Not Available In India" అనే సందేశం వస్తోంది. దీంతో పాకిస్థాన్ సెలెబ్రెటీలు భయపడిపోతున్నారు.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
భయపడుతున్న పాకిస్థాన్ సెలెబ్రెటీలు
ఇటీవలే పాకిస్థానీ టిక్ టాక్ స్టార్ జనత్ మీర్జా(Jannat Mirza) ఓ న్యూస్ ఛానెల్ ముందు బహిరంగంగా పాకిస్థాన్ సైన్యానికి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. పాకిస్థాన్- ఇండియా పరిస్థితి గురించి ప్రశ్నించగా తానేమి మాట్లాడలేనని పారిపోయింది. ఇప్పటికే ఇండియాలో పాకిస్థాన్ నటుల YouTube/Instagram ఖాతాలు నిషేధం ఎదుర్కొంటున్నాయి. దీంతో పాక్ సెలెబ్రెటీలు ఈ పరిస్థితి పై మాట్లాడేందుకు భయపడుతున్నారు అని అనుకుంటున్నారు నెటిజన్లు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టిక్ టాక్ స్టార్ జనత్ మీర్జాకు ఇన్స్టాగ్రామ్ లో 6 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు.
Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్లో టెన్షన్ టెన్షన్..!
Pakistani TikTok star Janat Mirza refuses to support Pakistan Army publicly in front of TV News Channels. Pakistani Celebrities are increasingly afraid of speaking on India’s Kashmir or support Pakistan Army because their YouTube/Instagram account could face a ban in India. pic.twitter.com/AXa3Fm2Dh9
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 2, 2025
ఇదిలా ఉంటే బుధవారం సాయంత్రం పాకిస్థాన్ కి చెందిన ప్రముఖ నటులు మహిరా ఖాన్, హనియా ఆమీర్, అలీ జాఫర్ల ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ భారతదేశంలో బ్లాక్ అయ్యాయి. వారి ప్రొఫైల్ ఓపెన్ చేయగా.. "Account Not Available In India" అనే సందేశం వస్తోంది. దీంతో పాటు భారత ప్రభుత్వం 16 పాకిస్థానీ యూట్యూబ్ ఛానల్స్ను నిషేధించింది. ఈ ఛానల్స్ హానికరమైన, సున్నితమైన విషయాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించింది.
/rtv/media/media_files/2025/05/02/MlNtdwpfGa0bWfsyGgcx.png)
telugu-news | Pakistan actors | Jannat Mirza