/rtv/media/media_files/2025/05/13/qclyk3jAVDNMOuUzivdw.jpg)
దేశం గర్వించదగ్గ ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కచ్చితంగా ఉంటారు. ఇటీవలే ఈ ఇద్దరు క్రికెటర్లు టెస్టు ఫార్మట్ కు గుడ్ బై చెప్పారు. ఇప్పటికే వీరిద్దరూ టీ20 ఫార్మట్ కు కూడా వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ 2027 వరల్డ్ కప్ వరకూ ఆడుతారా లేకా ఇలాగే సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించి షాకిస్తారా అనేది అభిమానుల్లో కంగారు నెలకొంది.
Also read : BIG BREAKING: 11 మంది పాక్ సైనికులు హతం.. 78 మందికి గాయాలు!
గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ, రోహిత్ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడకపోవచ్చునంటూ అభిప్రాయపడ్దారు. రెండు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన వీరిద్దరూ వన్డేలు ఆడుతూ 2027వరకు ఫామ్ కొనసాగించగలరా అంటే నన్ను అడిగితే కష్టమేనని చెబుతానని అన్నారు. ఈ లోపు వరుస సెంచరీలు చేస్తే అవకాశం ఉండవచ్చు అని గవాస్కర్ చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలంలో వాళ్ళు మంచి ఫామ్లో ఉంటే, వాళ్ళు సెంచరీలు చేస్తూనే ఉంటే, దేవుడు కూడా వాళ్ళని వదిలిపెట్టలేడు అని గవాస్కర్ తెలిపాడు.
Also read : Pawan Kalyan - OG Update: ‘ఓజి’ సెట్లో పవన్ కళ్యాణ్!.. ఈసారి ముగిద్దాం అంటూ పోస్ట్
రోహిత్, విరాట్ ఐదు రోజుల వ్యవధిలో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. రోహిత్ మే 7న రెడ్-బాల్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా, విరాట్ మే 12న రిటైర్మెంట్ తీసుకున్నాడు. 2024 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత వీరిద్దరూ టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు .2027 వన్డే ప్రపంచ కప్ ఆడే సమయానికి రోహిత్ వయసు 40 సంవత్సరాలు కాగా, విరాట్ వయసు 38 సంవత్సరాలు ఉంటుంది.
Also Read: కాల్పుల విరమణలో వీళ్లే కీలకం.. ఇరు దేశాల DGMO గురించి మీకు తెలుసా?