Karun Nair: నా ఇన్నింగ్స్‌కు విలువ లేదు.. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ సంచలన కామెంట్స్!

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టిన ఢిల్లీ బ్యాట్స్ మెన్ కరణ్‌ నాయర్ సంచలన కామెంట్స్ చేశాడు. 40 బంతుల్లో 89 పరుగులు చేసిన అతను తన ఇన్నింగ్స్‌కు విలువలేకుండా పోయిందన్నాడు. 12 పరుగుల తేడాతో ఢిల్లీ ఓడటం తనను నిరాశపరిచిందని చెప్పాడు. 

author-image
By srinivas
New Update
karan

Delhi batsman Karan Nair sensational comments

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టిన ఢిల్లీ బ్యాట్స్ మెన్ కరణ్‌ నాయర్ సంచలన కామెంట్స్ చేశాడు. 40 బంతుల్లో 89 పరుగులు చేసిన అతను తన ఇన్నింగ్స్‌కు విలువలేకుండా పోయిందన్నాడు. 12 పరుగుల తేడాతో ఓడటం తనను నిరాశపరిచిందని చెప్పాడు. 

Also Read :  మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..

ఆరంభంనుంచే అటాక్..

ఈ మేరకు ముంబైతో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో వచ్చిన కరుణ్‌ నాయర్ ఆరంభంనుంచే అదరగొట్టాడు. 40 బంతుల్లో 12 ఫోర్టు 6 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. అతను క్రీజులో ఉన్నంతసేపు ఢిల్లీ విజయం ఖాయంగానే కనిపించింది. కానీ చివర్లో వరుస వికెట్లుపడటంతో ఓటమిపాలైంది. దీంతో గెలుపువాకిట నిలిచిన మ్యాచ్ ముంబై లాగేసుకోవడంతో తాను తీవ్ర నిరాశకు గురయ్యానన్నాడు. 

Also Read :  వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు .. స్పందించిన ప్రధాని మోదీ

Also Read :  'జాగ్రత్త.. మీ వాట్సాప్‌ హ్యాక్ అవ్వొచ్చు'.. కేంద్రం హెచ్చరిక

మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కరణ్‌.. ‘నా ఇన్నింగ్స్‌ గురించి చెప్పడానికి ఏమీ లేదు. చెప్పినా పెద్దగా ఉపయోగం లేదు. అద్భుత ప్రదర్శన చేసినా ఓటమి బాధించింది. ముఖ్యంగా నా ఇన్నింగ్స్‌కు విలువలేకుండా పోయింది. ఓడినప్పుడు ఎంత గొప్ప ఇన్నింగ్స్‌ అయినా వేస్ట్. అవకాశం వచ్చినా ప్రతిసారి నిరూపించుకొనేందుకు సిద్ధంగా ఉంటున్నా. పవర్‌ ప్లేలో దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. కాబట్టి నేను మామూలుగా ఆడే షాట్లనే కొట్టాను. అన్నీ కలిసొచ్చాయి. బ్యాటింగ్‌ పరంగా  హ్యాపీగానే ఉన్నా. విజయం దక్కితే మరితం సంతోషంగా ఉండేది' అంటూ చెప్పుకొచ్చాడు. 

Also Read :  రాజగోపాల్ రెడ్డి బాటలో మరో ఎమ్మెల్యే.. నాకే మంత్రి పదవి రాకుంటే.. వీడియో వైరల్!

today telugu news | telugu-news | IPL 2025 | mi-vs-dc | latest-telugu-news | telugu-sports-news | telugu-cricket-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు