/rtv/media/media_files/2025/02/03/07rkxTb1z14o0rYOAJHk.jpg)
Nitish post Photograph: (Nitish post)
ముంబై వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో టీమిండియా 247 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో యువరాజ్ సింగ్ శిష్యుడు అభిషేక్ శర్మ 54 బంతుల్లో 13 సిక్సులు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశాడు. ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. టీ20ల్లో ఒక ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు.
ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!
Well Done Abhishek Sharma 🔥
— Raja Babu (@GaurangBhardwa1) February 2, 2025
Bus chakke hi maari jaa 🤣#INDvENG #AbhishekSharma pic.twitter.com/jv9qvWdD30
ఇది కూడా చూడండి: India vs England 5th T20I: టీమిండియా ఘన విజయం.. ఇంగ్లండ్ చిత్తు చిత్తు!
నితీశ్ రెడ్డి ప్రశంసిస్తూ..
అలాగే ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా కూడా అభిషేక్ శర్మ నిలిచాడు. దీంతో అభిషేక్పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. యువీ శిష్యుడు అనిపించుకున్నాడని, రెండో యువీ వచ్చాడని కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో క్రికెటర్ నితీశ్ రెడ్డి కూడా అభిషేక్ శర్మను ప్రశంసించాడు. తనదైన శైలిలో మెంటల్ నా కొడుకు అంటూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ సిరీస్ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో లీడ్లో ఉంది. మరి ఈ సిరీస్లో ఆఖరి మ్యాచ్ ఇండియా లేదా ఇంగ్లాండ్ గెలుస్తుందో చూడాలి.
ఇది కూడా చూడండి: Israel: నెతన్యాహు సతీమణి పై నేర విచారణ!
Nitish Kumar Reddy's Instagram story for Abhishek Sharma. 🦁❤️ pic.twitter.com/ACy3U8aD4r
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 2, 2025
ఇది కూడా చూడండి: Vasant Panchami : నేడు వసంత పంచమి.. బాసరకు పోటెత్తిన భక్తులు