/rtv/media/media_files/2024/12/13/AVoqIGfFKktwFd1ev2Ce.webp)
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఎప్పుడు కొత్త చర్యలు తీసుకుంటుంది. అకౌంట్ హోల్డర్లకు క్వాలిటీ సర్వీసెస్ అందించేందుకు కీలక నిర్ణయాలు అమలు చేస్తుంటుంది. కాగా బ్యాంకుల్లో సేవింగ్, కరెంట్, శాలరీ ఇలా రకరకాల బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు. అయితే ఖాతా తెరిచే సమయంలో చాలా మంది నామినీని చేర్చకుండా వదిలేస్తుంటారు. దీని వల్ల ఖాతాదారులు నష్టపోయే అవకాశం ఉంటుంది.
ఖాతాలకు కచ్చితంగా..
ఈ క్రమంలో తాజాగా ఆర్బీఐ బ్యాంక్ ఖాతాలపై ఓ కీలక ప్రకటన చేసింది. యాక్టివ్ లో ఉన్న అన్ని రకాల ఖాతాలకు, లాకర్లకు ఇకపై తప్పనిసరిగా నామినీలను చేర్చాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అకౌంట్ ఉన్నవారికి, కొత్తగా ఖాతా ఓపెన్ చేసే వారికి ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. బ్యాంకులు ఖాతాలకు కచ్చితంగా నామినీలను జోడించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.
Also Read: America: మారణహోమానికి మీ నిర్ణయాలే కారణం..బ్లింకన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు!
నామినీలు లేకపోవడం..
లెక్కకు మించి బ్యాంకు ఖాతాలకు నామినీలు లేరని దీని వల్ల ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో చాలా డిపాజిట్ ఖాతాలకు నామినీలు లేరని ఆర్బీఐ గుర్తించింది. ఖాతాలకు నామినీ ఉండాల్సిందేనని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. నామినీలు లేకపోవడం కారణంగా ఖాతాదారులు మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఖాతాలోని డబ్బును పొందలేకపోతున్నారు.
నామినీ లేకపోవడం కారణంగా కుటుంబ సభ్యులు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ ఖాతాలకు నామినీలను తప్పనిసరి చేసింది.
Also Read: సైఫ్ అలీఖాన్ సెక్యూరిటీని చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు.. విచారణలో విస్తుపోయే విషయాలు
Also Read: Black Magic: చేతబడి అనుమానం.. వృద్ధురాలికి మూత్రం తాగించి, చెప్పులతో ఊరేగించిన స్థానికులు