/rtv/media/media_files/2025/04/20/ub9IzN6XNLTzKpLHghrM.jpg)
BCCI key announcement on IPL Punjab vs Delhi match schedule
IPL 2025: భారత్-పాక్ వార్ ఎఫెక్ట్తో ఆగిపోయిన ఐపీఎల్ టోర్నీ మే 17నుంచి మళ్లీ మొదలుకానుంది. ధర్మశాల వేదికగా 10 ఓవర్ల తర్వాత ఆగిపోయిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ మే 24న జైపుర్ వేదికగా మళ్లీ మొదటినుంచి ప్రారంభించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఇరుజట్ల ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఆ మ్యాచ్ మళ్లీ మొదటి నుంచి..
ఈ మేరకు రీ షెడ్యూల్ చేసిన టోర్నీలోని లీగ్ మ్యా్చ్లు మొత్తం 6 వేదికలు బెంగళూరు, జైపుర్, ఢిల్లీ, లఖ్నవూ, అహ్మదాబాద్, ముంబైలో జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 3న నిర్వహించనుండగా ప్లే ఆఫ్స్ వేదికలను త్వరలో ప్రకటించనున్నారు. అయితే మే 8న ధర్మశాలలో ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్10.1 ఓవర్ల ఆట నడుస్తుండగా పాక్ బాంబుల వర్షం కురిపించడంతో మ్యాచ్ రద్దు చేశారు. అయితే ఈ మ్యాచ్ మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. పంజాబ్ 10.1 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 1 వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. ఇక పంజాబ్ ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి 15 పాయింట్లు సాధించగా.. మిగిలిన మూడు మ్యాచ్ల్లో ఒకదాంట్లో గెలిస్తే ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది.
Also Read: పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ ను ప్రశ్నిస్తూ ఓవైసీ సంచలన ట్వీట్!
మరోవైపు భారత్-పాక్ వార్ ఎఫెక్ట్ కారణంగా ఐపీఎల్ 2025 వాయిదా పడింది. అయితే టోర్నీ రీ షెడ్యూల్ కారణంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న RCBకి ఊహించని షాక్ తగిలింది. ఈసారి కప్ సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతున్న బెంగళూర్ టీమ్ ను ఒకవైపు గాయాలు వేధిస్తుంటే మరోవైపు స్టార్ ఆటగాళ్ల టైమ్ పీరియడ్ ముగియడంతో తిరిగి తమ దేశాలకు ప్రాతినిథ్యం వహించేందుకు వెళ్లిపోనున్నారు.
Also Read : కాలేయ ఆరోగ్యానికి జుట్టు రాలడానికి సంబంధం ఏంటి...?
punjab | delhi | match | today telugu news