Schools Holiday : విద్యార్థులకు అలర్ట్.. ఇవాళ, రేపు నో స్కూల్స్..!
పాఠశాల విద్యార్థులు, కాలేజీ స్టూడెంట్స్కు అలర్ట్. వరుసగా రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇవాళ, రేపు (గురు, శుక్రవారాల్లో) సెలవులు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అన్ని విద్యాసంస్థలకు రెండురోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తిరిగి పాఠశాలలు శనివారం (జులై 22) ప్రారంభమవుతాయని చెప్పారు.