గుజరాత్లోని అహ్మదాబాద్లో బుధవారం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్లోని ఎస్జి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. అతివేగంతో ప్రయాణిస్తున్న జాగ్వార్ వాహనం అదుపు తప్పి రోడ్డుపై ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. ఎస్జి హైవేపై మొదట థార్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడ జనం గూమిగూడారు. అంతలోనే జాగ్వార్ వాహనం అతివేగంతో దూసుకువచ్చింది. అదుపు తప్పి రోడ్డుపై నిలుచుకున్నవారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9మంది అక్కడిక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ లారీని తీసుకుని పరారయ్యాడు.
పూర్తిగా చదవండి..Ahmedabad : ఘోరరోడ్డు ప్రమాదం..9 మంది మృతి..!!
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్లోని ఎస్జి హైవేపై ఈ ప్రమాదం జరిగింది. అదుపుతప్పి జాగ్వార్ వాహనం జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు.
Translate this News: