రాజస్థాన్ మంత్రి ప్రతాప్ సింగ్…ఆయన మేనల్లుడు ఖచరియావాస్. మంత్రి మేనల్లుడికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. రాష్ట్ర మంత్రి ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ మేనల్లుడు మద్యం మత్తులో ఓ హోటల్ను ధ్వంసం చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. మొదట హోటల్ సిబ్బందితో ఏదో విషయంపై వాగ్వాదానికి దిగినట్లు, ఆ తర్వాత అకస్మాత్తుగా సహనం కోల్పోయి ఎదురుగా కౌంటర్ లో ఉన్న వ్యక్తిపై దాడి చేయడం ఈ వీడియోలో కనిపిస్తోంది. పోలీసులు అక్కడికక్కడే ఉన్నా అతన్ని మాత్రం అడ్డుకోలేదు.
పూర్తిగా చదవండి..Viral Video : మద్యం మత్తులో హోటల్ను ధ్వంసం చేసిన మంత్రి మేనల్లుడు..!!
పీకల్లోతు తాగాడు...తాగిన మైకంలో ఏం చేయాలో అర్థం కాలేదు..దీంతో హోటల్ పై దాడి చేశాడు. చేతికి వచ్చినవన్నీ విసిరిపాడేశాడు...ఎంతైనా మంత్రి మేనల్లుడు కదా..ఏం చేసినా..అడిగేవాడుండడు. దీంతో రెచ్చిపోయాడు. హోటల్ కౌంటర్ పై ఉన్న వ్యక్తిపై దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు కళ్లప్పగించి చూస్తున్నారు తప్పా అడ్డుకోలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Translate this News: