Siddipet: వెరైటీ దొంగ...ఏకంగా బస్సునే కొట్టేశాడు

దోచుకోవడానికి ఏం దొరకలేదనుకుంటాను ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్ళాడో దొంగ. డ్రైవర్ గా మారి...ప్యాసింజర్స్ ను ఎక్కించుకుని వెళ్ళాడు. దారి మధ్యలో డీజిల్ అయిపోవడంతో బస్సును అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు.

New Update
Siddipet: వెరైటీ దొంగ...ఏకంగా బస్సునే కొట్టేశాడు

డబ్బులు, విలువైన వస్తువులు, ఆభరనాలు ఇలాంటి దొంగతనాల గురించి మనం చాలానే విని ఉంటాం. కానీ ఆర్టీసీ బస్సును దొంగతనం చేసిన దొంగ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. ఇదిగో ఇప్పుడు మీరు చదువుతున్నది అలాంటి దొంగ గురించే. ఇది ఎక్కడో జరగలేదు ఇక్కడే మన తెలంగాణలో సిద్ధిపేటలో జరిగింది. బస్సును దొంగతనం చేసిన వాడు ఎంచక్కా పారిపోకుండా ప్రయాణికులను ఎక్కించుకుని మరీ వెళ్ళాడు. దాంతో ఈ దొంగ, అతని దొంగతనం విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఆదివారం రాత్రి సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావ్ క్యాంపు కార్యాలయం దగ్గర పార్క్ చేసి ఉన్న TS 36 TA 3336 ఆర్టీసీ అద్దె బస్సు చోరికి గురైంది. అక్కడ నుంచి బస్సును తీసుకెళ్ళిన దొంగ దాన్ని వేములవాడ తీసుకువెళ్ళి ప్రయాణికులను ఎక్కించుకొని సిరిసిల్ల, సిద్దిపేట దారి మధ్యలో బస్సును, ప్రయాణికులు రోడ్డుపైనేవదిలేసాడు. బస్సులో డీజిల్ అయిపోవడంతో ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి పరారయ్యాడు. కేటుగాడు ఉడాయించాడు.

దారి మధ్యలో బస్సు ఆగిపోవడం, డ్రైవర్ పారిపోవడంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ అద్దె బస్సును దొంగ అపహరించడం.. దానిని ఎవరూ కూడా గుర్తించకపోవడం విచిత్రంగా ఉందని పోలీసులు అంటున్నారు. ప్రయాణికులకు అతని డ్రైవింగ్ పై అనుమానం వచ్చి ప్రశ్నించగా దొంగ అని బయటపడిందని స్థానికులు చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు